ETV Bharat / city

కరోనా విజృంభణతో ఏపీలో ఆ జిల్లాల్లో పరిస్థితి ఏంటి ?

author img

By

Published : Jun 24, 2020, 8:38 PM IST

లాక్ డౌన్​ వరకూ కొంత బాధ్యతగానే ఉన్నారు. కానీ ఆర్థిక ఇబ్బందులు, ఇతర అవసరాల తీర్చుకునేందుకు ఇంట్లో కూర్చోలేని పరిస్థితి. అర్థం చేసుకున్న ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చింది. సొంత ఊళ్లకు వెళ్లొచ్చని గేట్లు తెరిచారు. రాకపోకలకు అనుమతి ఇచ్చారు. వ్యాపారాలు చేసుకోవచ్చు... పరిశ్రమలు తెరుచుకోవచ్చు... బస్సులు రాకపోకలు కొనసాగుతాయి అనటంతో జనాలు మళ్లీ మామూలుగా బయట తిరగడం ప్రారంభించారు. భౌతిక దూరం మరిచారు. మాస్క్​లు లేవు.. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రంలో కరోనా మరోసారి తిరగబెట్టింది. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలో లాక్ డౌన్​ విధించారు. ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులు..కేసుల తీరు ఎలా ఉంది..? మళ్లీ లాక్ డౌన్​ విధించిటం పట్ల ప్రజలెమనుకుంటున్నారనే దానిపై ఈటీవీ భారత్ స్పెషల్ ఫోకస్.

lock down
lock down

కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని అనుకుంటున్న వేళ ఏపీలో వైరస్ మరోసారి తిరగబెట్టింది. పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరిగుతూ వస్తున్నాయి. దీంతో ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లాక్ డౌన్​కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని మూడు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. కృష్ణా జిల్లాలో లాక్ డౌన్​ ప్రకటించినప్పటికీ.. నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు. అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో లాక్ డౌన్​ అమల్లో ఉండగా... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ప్రకాశంలో ప్రస్తుత పరిస్థితి

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అంతకుమందుకు మూడు నుంచి ఐదు కేసులు నమోదు అయ్యేవి. కానీ ప్రస్తుతం 20 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 340 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఒక్క ఒంగోలులోనే ఇంతవరకూ 83 కేసులు ఉన్నాయి. చీరాలలో 48 పాజిటివ్‌ కేసులు, వేటపాలెంలో 16 కేసులు, కందుకూరులో 22 కేసులు, టంగుటూరు మండలంలో 14 కనిగిరిలో 9, మార్కాపురంలో 10, గుడ్లూరులో12 కేసులు ఉన్నాయి. ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఆదివారం నుంచి 14 రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు.. ఉదయం 10 గంటల వరకు కూరగాయలు, పాలు వంటి నిత్యవసరాల కోసం దుకాణాలు తెరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 47 కంటైన్‌మెంట్లు జోన్లుగా విభజించి ఎక్కువ కంటైన్​మెంట్‌ జోన్లు ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌ డౌన్‌ ప్రకటించారు.

'వ్యాపారంగా అస్తవ్యస్తంగా మారింది. దుకాణాలు తెరిచి 20 రోజులు పాటు కాకముందే మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. కొంత గాడిలో పడుతున్నామన్న వేళ ఇలాంటి నిర్ణయం ప్రకటించటం సరికాదు. మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లక తప్పేలా లేదు'

- వ్యాపారులు

అనంతలో ఆగని కరోనా

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1,234 మందికి సోకింది. గతం వారం రోజులుగా కేసుల నమోదు ఎక్కువగా ఉంది. కేసులు ఎక్కవగా నమోదవుతున్న పలు ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 21 నుంచి ఆంక్షలు పెట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు వరకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిందని ఆనందపడిన చిన్న వ్యాపారులు, దుకాణ దారులకు మళ్లీ లాక్ డౌన్ విధించటం పిడుగుపాటుగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో

శ్రీకాకుళం జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కేసులు పెరుగుతున్నాయి. సామాజిక వ్యాప్తి దిశగా మారకముందే పలు చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు.

'లాక్ డౌన్ ఎత్తివేశాక కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సామాజిక వ్యాప్తి మొదలైంది. రాజాం, ఇచ్ఛాపురం, పలాస వంటి ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించాం. ఎక్కువ కేసులు నమోదవ్వకపోతే లాక్ డౌన్ విధిస్తాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.'

- శ్రీకాకుళంజిల్లా కలెక్టర్

తూర్పులోనూ అదే పరిస్థితి

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అధికారులు జిల్లాలోని 80 కంటైన్​మెంట్ జోన్లలో మళ్లీ లాక్​డౌన్ విధించారు. కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం కనకాలపేటలో కరోనా పాజిటివ్ కేసు ఉండటంతో ఆ గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి.. 14 రోజులపాటు అన్ని రకాల వ్యాపారాలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. తాళ్లరేవు మండలం వెంకటాయపాలెం, కాట్రేనికోన మండలం దొంతుకుర్రులో గ్రామాలను కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించారు.

విజయనగరం జిల్లాలో

విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 178 కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ తెలిపారు. గ్రీన్ జోన్లో ఉన్న జిల్లాలో లాక్ డౌన్ తరువాత కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. నివారణ కార్యక్రమంలో భాగంగా... వైరస్ వ్యాప్తి నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని అనుకుంటున్న వేళ ఏపీలో వైరస్ మరోసారి తిరగబెట్టింది. పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరిగుతూ వస్తున్నాయి. దీంతో ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లాక్ డౌన్​కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని మూడు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. కృష్ణా జిల్లాలో లాక్ డౌన్​ ప్రకటించినప్పటికీ.. నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు. అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో లాక్ డౌన్​ అమల్లో ఉండగా... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ప్రకాశంలో ప్రస్తుత పరిస్థితి

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అంతకుమందుకు మూడు నుంచి ఐదు కేసులు నమోదు అయ్యేవి. కానీ ప్రస్తుతం 20 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 340 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఒక్క ఒంగోలులోనే ఇంతవరకూ 83 కేసులు ఉన్నాయి. చీరాలలో 48 పాజిటివ్‌ కేసులు, వేటపాలెంలో 16 కేసులు, కందుకూరులో 22 కేసులు, టంగుటూరు మండలంలో 14 కనిగిరిలో 9, మార్కాపురంలో 10, గుడ్లూరులో12 కేసులు ఉన్నాయి. ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఆదివారం నుంచి 14 రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు.. ఉదయం 10 గంటల వరకు కూరగాయలు, పాలు వంటి నిత్యవసరాల కోసం దుకాణాలు తెరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 47 కంటైన్‌మెంట్లు జోన్లుగా విభజించి ఎక్కువ కంటైన్​మెంట్‌ జోన్లు ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌ డౌన్‌ ప్రకటించారు.

'వ్యాపారంగా అస్తవ్యస్తంగా మారింది. దుకాణాలు తెరిచి 20 రోజులు పాటు కాకముందే మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. కొంత గాడిలో పడుతున్నామన్న వేళ ఇలాంటి నిర్ణయం ప్రకటించటం సరికాదు. మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లక తప్పేలా లేదు'

- వ్యాపారులు

అనంతలో ఆగని కరోనా

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1,234 మందికి సోకింది. గతం వారం రోజులుగా కేసుల నమోదు ఎక్కువగా ఉంది. కేసులు ఎక్కవగా నమోదవుతున్న పలు ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 21 నుంచి ఆంక్షలు పెట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు వరకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిందని ఆనందపడిన చిన్న వ్యాపారులు, దుకాణ దారులకు మళ్లీ లాక్ డౌన్ విధించటం పిడుగుపాటుగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో

శ్రీకాకుళం జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కేసులు పెరుగుతున్నాయి. సామాజిక వ్యాప్తి దిశగా మారకముందే పలు చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు.

'లాక్ డౌన్ ఎత్తివేశాక కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సామాజిక వ్యాప్తి మొదలైంది. రాజాం, ఇచ్ఛాపురం, పలాస వంటి ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించాం. ఎక్కువ కేసులు నమోదవ్వకపోతే లాక్ డౌన్ విధిస్తాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.'

- శ్రీకాకుళంజిల్లా కలెక్టర్

తూర్పులోనూ అదే పరిస్థితి

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అధికారులు జిల్లాలోని 80 కంటైన్​మెంట్ జోన్లలో మళ్లీ లాక్​డౌన్ విధించారు. కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం కనకాలపేటలో కరోనా పాజిటివ్ కేసు ఉండటంతో ఆ గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి.. 14 రోజులపాటు అన్ని రకాల వ్యాపారాలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. తాళ్లరేవు మండలం వెంకటాయపాలెం, కాట్రేనికోన మండలం దొంతుకుర్రులో గ్రామాలను కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించారు.

విజయనగరం జిల్లాలో

విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 178 కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ తెలిపారు. గ్రీన్ జోన్లో ఉన్న జిల్లాలో లాక్ డౌన్ తరువాత కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. నివారణ కార్యక్రమంలో భాగంగా... వైరస్ వ్యాప్తి నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.