ETV Bharat / city

ప్రధాని మోదీ ఇలాఖాలో 'దేశ్​ కీ నేత కేసీఆర్' అంటూ భారీ హోర్డింగ్స్​​ - వారణాసిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు

KCR Hoardings in Varanasi: సీఎం కేసీఆర్​ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు, ఆయన అభిమానులు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆ అభిమానం రాష్ట్రాలు దాటింది. యూపీ వారణాసిలోనూ కేసీఆర్​కు విషెష్​ చెబుతూ భారీ హోర్డింగ్లు వెలిశాయి. ప్రధాని మోదీ నియోజకవర్గంలో సీఎం హోర్డింగ్​లు ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

kcr hoardings in up
kcr hoardings in up
author img

By

Published : Feb 18, 2022, 6:04 PM IST

Updated : Feb 18, 2022, 6:28 PM IST

KCR Hoardings in Varanasi: సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమాని యూపీలోని ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ హోర్డింగ్లు​ ఏర్పాటు చేశారు. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే వ్యక్తి.. చౌక ఘాట్, ఫట్మన్ రోడ్​తో పాటు ముఖ్యమైన సెంటర్లలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్​కు పుట్టిన రోజు విషెష్​ చెబుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్​లపై 'దేశ్​ కీ నేత కేసీఆర్​' అని రాసి ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్​ హోర్డింగ్​లు ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రధానమంత్రి పదవికి అర్హులు

కేసీఆర్​ హోర్డింగ్లు​ ఏర్పాటు చేసిన మృత్యుంజయ మిశ్రా ఈటీవీ భారత్​తో మాట్లాడారు. వారణాసిలో హోర్డింగ్లు​ ఏర్పాటు చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని మిశ్రా చెప్పుకొచ్చారు. కేసీఆర్​కు శుభాకాంక్షలు తెలిపేందుకే పెట్టినట్లు తెలిపారు. ఇది రాజకీయాలతో సంబంధం లేని అంశమని అన్నారు. అయితే కేసీఆర్ ప్రధాన మంత్రి పదవికి అర్హులని చెప్పారు. ప్రస్తుతం దేశంలో చాలా మంది నేతలు ప్రధాని పదవి రేసులో ఉన్నారని... అందులో కేసీఆర్ కూడా ఒకరని పేర్కొన్నారు.

కేసీఆర్​దే కీలక పాత్ర

'కేసీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే మా ఆకాంక్ష. మీ సాయంతో మేం శుభాకాంక్షలు కూడా చెప్పాం. మీ సాయంతో ఇది కేసీఆర్​కు కూడా చేరుకుంది. మేము ఎన్నో ఏళ్లు తెలంగాణలో పనిచేశాం. ఉద్యమాన్ని దగ్గరి నుంచి చూశాం. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటును దగ్గరి నుంచి చూశాం. ఎంతో మంది త్యాగాలు, పోరాటాలతో తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర కేసీఆర్​దే అవుతుంది. ఇది ఎవరు కాదనలేని నిజం.'

- మృత్యుంజయ మిశ్రా, కేసీఆర్ వీరాభిమాని

మృత్యుంజయ మిశ్రాతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి

ఇదీ చదవండి : Cm Kcr Birthday Celebrations: పూరి సముద్రతీరంలో సీఎం కేసీఆర్ సైకతశిల్పం

KCR Hoardings in Varanasi: సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమాని యూపీలోని ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో భారీ హోర్డింగ్లు​ ఏర్పాటు చేశారు. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే వ్యక్తి.. చౌక ఘాట్, ఫట్మన్ రోడ్​తో పాటు ముఖ్యమైన సెంటర్లలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్​కు పుట్టిన రోజు విషెష్​ చెబుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ హోర్డింగ్​లపై 'దేశ్​ కీ నేత కేసీఆర్​' అని రాసి ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్​ హోర్డింగ్​లు ఏర్పాటు చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రధానమంత్రి పదవికి అర్హులు

కేసీఆర్​ హోర్డింగ్లు​ ఏర్పాటు చేసిన మృత్యుంజయ మిశ్రా ఈటీవీ భారత్​తో మాట్లాడారు. వారణాసిలో హోర్డింగ్లు​ ఏర్పాటు చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని మిశ్రా చెప్పుకొచ్చారు. కేసీఆర్​కు శుభాకాంక్షలు తెలిపేందుకే పెట్టినట్లు తెలిపారు. ఇది రాజకీయాలతో సంబంధం లేని అంశమని అన్నారు. అయితే కేసీఆర్ ప్రధాన మంత్రి పదవికి అర్హులని చెప్పారు. ప్రస్తుతం దేశంలో చాలా మంది నేతలు ప్రధాని పదవి రేసులో ఉన్నారని... అందులో కేసీఆర్ కూడా ఒకరని పేర్కొన్నారు.

కేసీఆర్​దే కీలక పాత్ర

'కేసీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే మా ఆకాంక్ష. మీ సాయంతో మేం శుభాకాంక్షలు కూడా చెప్పాం. మీ సాయంతో ఇది కేసీఆర్​కు కూడా చేరుకుంది. మేము ఎన్నో ఏళ్లు తెలంగాణలో పనిచేశాం. ఉద్యమాన్ని దగ్గరి నుంచి చూశాం. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటును దగ్గరి నుంచి చూశాం. ఎంతో మంది త్యాగాలు, పోరాటాలతో తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర కేసీఆర్​దే అవుతుంది. ఇది ఎవరు కాదనలేని నిజం.'

- మృత్యుంజయ మిశ్రా, కేసీఆర్ వీరాభిమాని

మృత్యుంజయ మిశ్రాతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి

ఇదీ చదవండి : Cm Kcr Birthday Celebrations: పూరి సముద్రతీరంలో సీఎం కేసీఆర్ సైకతశిల్పం

Last Updated : Feb 18, 2022, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.