ETV Bharat / city

Amaravati Farmers Padayatra: అమరావతి మహా పాదయాత్రలో ముస్లిం, క్రైస్తవ రథాల సీజ్..

Amaravati Farmers Padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 32వ రోజైన నేడు.. మరుపల్లి దగ్గర నుంచి ప్రారంభమైంది. మహా పాదయాత్రలో ఉన్న క్రైస్తవ, ముస్లిం రథాల్ని పోలీసులు సీజ్ చేశారు. బుధవారం పాదయాత్ర వెనుక వాహనాల్ని పంపిస్తామని చెప్పటంతో.. రైతులు ఆందోళన విరమించగా పాదయాత్ర ముందుకు కదిలాక డ్రైవర్లను బెదిరించి వాహనాల తాళాలు పోలీసులు తీసుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Dec 2, 2021, 4:22 PM IST

Amaravati
అమరావతి
అమరావతి మహా పాదయాత్రలో ముస్లిం, క్రైస్తవ రథాల సీజ్..

Amaravati Farmers Padayatra: మహా పాదయాత్రలో ఉన్న క్రైస్తవ, ముస్లిం రథాల్ని పోలీసులు సీజ్ చేశారు. బుధవారం పాదయాత్ర వెనుక వాహనాల్ని పంపిస్తామని చెప్పటంతో.. రైతులు ఆందోళన విరమించగా పాదయాత్ర ముందుకు కదిలాక డ్రైవర్లను బెదిరించి వాహనాల తాళాలు పోలీసులు తీసుకున్నారని రైతులు తెలిపారు. రైతులతో మాట్లాడిన క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు తమ మతాచారాలు కించపరిచే విధంగా పోలీసుల చర్యలున్నాయని.. ఆగ్రహానికి గురయ్యారు. ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు రైతులకు సంఘీభావం తెలిపారు. ఫాస్టర్లు రైతులతో ఫోన్లో మాట్లాడి సంఘీభావం తెలిపారు.

మహా పాదయాత్ర 32వ రోజైన ఇవాళ మరుపల్లి దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన సమయానికి డేగపూడి మీదుగా తుమ్మలతలుపులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భోజన విరామం అనంతరం.. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమై తురిమెర్ల వద్దకు చేరుకోగా... మొత్తం 14కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.

ఇదీ చూడండి: ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్.. రుణాలిస్తామని కోట్లల్లో మోసం

అమరావతి మహా పాదయాత్రలో ముస్లిం, క్రైస్తవ రథాల సీజ్..

Amaravati Farmers Padayatra: మహా పాదయాత్రలో ఉన్న క్రైస్తవ, ముస్లిం రథాల్ని పోలీసులు సీజ్ చేశారు. బుధవారం పాదయాత్ర వెనుక వాహనాల్ని పంపిస్తామని చెప్పటంతో.. రైతులు ఆందోళన విరమించగా పాదయాత్ర ముందుకు కదిలాక డ్రైవర్లను బెదిరించి వాహనాల తాళాలు పోలీసులు తీసుకున్నారని రైతులు తెలిపారు. రైతులతో మాట్లాడిన క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు తమ మతాచారాలు కించపరిచే విధంగా పోలీసుల చర్యలున్నాయని.. ఆగ్రహానికి గురయ్యారు. ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు రైతులకు సంఘీభావం తెలిపారు. ఫాస్టర్లు రైతులతో ఫోన్లో మాట్లాడి సంఘీభావం తెలిపారు.

మహా పాదయాత్ర 32వ రోజైన ఇవాళ మరుపల్లి దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన సమయానికి డేగపూడి మీదుగా తుమ్మలతలుపులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భోజన విరామం అనంతరం.. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమై తురిమెర్ల వద్దకు చేరుకోగా... మొత్తం 14కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.

ఇదీ చూడండి: ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్.. రుణాలిస్తామని కోట్లల్లో మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.