ETV Bharat / city

ముదిగొండ ఎస్సైపై వేటు.. ఏఆర్ హెడ్ క్వార్టర్స్​కు అటాచ్​ - khammam dist news

ఖమ్మం జిల్లా ముదిగొండలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్సై ప్రతాపం చూపించిన ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

mudigonda police
ముదిగొండ ఎస్సైపై వేటు
author img

By

Published : Mar 31, 2020, 7:57 PM IST

Updated : Mar 31, 2020, 10:05 PM IST

ముదిగొండ ఎస్సైపై వేటు పడింది. పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని బాధ్యత రహితంగా వ్యవహరించడంపై పోలీస్ కమిషనర్ స్పందించారు. ఎస్సై సతీశ్​ కుమార్​ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీని ఆదేశించారు.

ఈనెల 28న ముదిగొండ పీఎస్​ పరిధిలోని వనవారి కృష్టాపురం గ్రామంలో పేకాట అడుతున్నారనే సమాచారంతో ఎస్సై సతీశ్​ కుమార్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితోపాటు బాధ్యత రహితంగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

ముదిగొండ ఎస్సైపై వేటు పడింది. పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని బాధ్యత రహితంగా వ్యవహరించడంపై పోలీస్ కమిషనర్ స్పందించారు. ఎస్సై సతీశ్​ కుమార్​ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీని ఆదేశించారు.

ఈనెల 28న ముదిగొండ పీఎస్​ పరిధిలోని వనవారి కృష్టాపురం గ్రామంలో పేకాట అడుతున్నారనే సమాచారంతో ఎస్సై సతీశ్​ కుమార్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితోపాటు బాధ్యత రహితంగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

ఇవీ చూడండి: ఆపరేషన్​ నిజాముద్దీన్​: ఆ 157 మంది ఎక్కడ?

Last Updated : Mar 31, 2020, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.