ETV Bharat / city

మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు

author img

By

Published : Nov 5, 2021, 10:01 PM IST

Updated : Nov 6, 2021, 2:57 AM IST

telangana-high-court
telangana-high-court

21:53 November 05

మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు

మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్​ స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఒరిజనల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పాటు గుర్తింపుకార్డు చూపిన వ్యక్తికి స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 43కు పైగా పిటిషన్లపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తుంటారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొంటారు. కోర్టు విచారణ హజరై ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిగే అనర్థాలపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదంతా జరిగేందుకు మూడు రోజులకు పైగా పడుతుంది. అప్పుడు గానీ వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వరు.  

పోలీసుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నా.. ఈ ప్రక్రియ వల్ల తాగి వాహనం నడపకూడదనే భయం వాహనదారుల్లో వచ్చింది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. ఇదిలా ఉంటే ఈ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. నగరంలోని ఓ కమిషనరేట్ పరిధిలో అయితే వాహనం పట్టుబడితే సుమారు 15 రోజులు పాటు వాహనం సీజ్​లో ఉంటుంది. దీంతో పలువురు వాహనదారులు ఈ అంశాలపై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు ఇప్పటి వరకు 43కి పైగా పిటిషన్లు వచ్చాయి. వాటిని విచారించిన ధర్మాసనం.. ట్రాఫిక్ పోలీసులు వాహనం స్వాధీనానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ అదేశాలిచ్చింది.  మార్గదర్శకాలను అమలుచేయని పక్షంలో పోలీసులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.  

రోడ్డు ప్రమాదాలు, మరణాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న రోడ్డు భద్రత మార్గదర్శకాలను పాటించాల్సిన ప్రాథమిక బాధ్యత పౌరులపై ఉందని హైకోర్టు తెలిపింది. మోటారు వాహనాల చట్టం నిబంధనలతోపాటు సుప్రీం కోర్టుతోపాటు ఇదే హైకోర్టు గతంలో వెలువరించిన పలు తీర్పులను ఆధారంగా చేసుకుని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.  

  • డ్రైవరు, వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు తేలితే వాహనం నడపడానికి అనుమతించరాదు. అతనితోపాటు మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వాహనాన్ని సీజ్ చేయకుండా ఆ వ్యక్తి తీసుకునేలా చూడాలి.
  • మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ మినహా వాహనంలో ఎవరూ లేకపోతే.. సంబంధిత పోలీసు అధికారి.. వాహనం తీసుకెళ్లడానికి సమీపంలోని డ్రైవర్​ బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వాలి.  
  • ఒకవేళ ఎవరూ రాని పక్షంలో పోలీసు అధికారులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని సమీప పోలీస్​ స్టేషన్​ లేదంటే అధీకృత స్థలంలో సురక్షితంగా ఉంచాలి.
  • మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారన్న కారణంగా వాహనాన్ని స్వాధీనం / జప్తు చేసుకునే అధికారం పోలీసులకు లేదు.  
  • స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఆర్సీ, గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు చూపిన యజమాని లేదా అధీకృత వ్యక్తికి అప్పగించాలి.
  • వాహనం డ్రైవరు, యజమాని లేదా ఇద్దరినీ ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులు నిర్ణయించిన పక్షంలో వాహనాన్ని సీజ్ చేసిన మూడు రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్ వద్ద అభియోగ పత్రం దాఖలు చేయాలి. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక ప్రాంతీయ రవాణా అధికారులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని విడుదల చేయాలి.
  • మేజిస్ట్రేట్లు వాహనాన్ని సీజ్ చేసిన మూడు రోజుల్లో అభియోగ పత్రాన్ని స్వీకరించాలి.
  • తెలంగాణ రాష్ట్ర మోటారు వాహనాల చట్టంలోని నిబంధన 448 ఏలో పేర్కొన్న విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
  • వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లని పక్షంలో పోలీసులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.
  • ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  

అయితే ఇప్పటికే ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లలో కుప్పలు కుప్పలుగా వాహనాలు పేరుకుపోయాయి. కేసుల భయంతో కొందరు వాహనాలను సైతం వదులుకోగా... ఏం చేయాలో తెలియక కొందరు సందిగ్ధంలో పడ్డారు. గత డిసెంబర్ 31కి పట్టుబడిన వాహనాలే ఇంకా ఠాణాల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. 

ఇదీచూడండి: ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటుండగా ఫోన్‌లో చిత్రీకరణ.. ఆ తర్వాత..

21:53 November 05

మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: హైకోర్టు

మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్​ స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఒరిజనల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పాటు గుర్తింపుకార్డు చూపిన వ్యక్తికి స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 43కు పైగా పిటిషన్లపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తుంటారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొంటారు. కోర్టు విచారణ హజరై ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిగే అనర్థాలపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదంతా జరిగేందుకు మూడు రోజులకు పైగా పడుతుంది. అప్పుడు గానీ వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వరు.  

పోలీసుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నా.. ఈ ప్రక్రియ వల్ల తాగి వాహనం నడపకూడదనే భయం వాహనదారుల్లో వచ్చింది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. ఇదిలా ఉంటే ఈ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. నగరంలోని ఓ కమిషనరేట్ పరిధిలో అయితే వాహనం పట్టుబడితే సుమారు 15 రోజులు పాటు వాహనం సీజ్​లో ఉంటుంది. దీంతో పలువురు వాహనదారులు ఈ అంశాలపై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు ఇప్పటి వరకు 43కి పైగా పిటిషన్లు వచ్చాయి. వాటిని విచారించిన ధర్మాసనం.. ట్రాఫిక్ పోలీసులు వాహనం స్వాధీనానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ అదేశాలిచ్చింది.  మార్గదర్శకాలను అమలుచేయని పక్షంలో పోలీసులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.  

రోడ్డు ప్రమాదాలు, మరణాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న రోడ్డు భద్రత మార్గదర్శకాలను పాటించాల్సిన ప్రాథమిక బాధ్యత పౌరులపై ఉందని హైకోర్టు తెలిపింది. మోటారు వాహనాల చట్టం నిబంధనలతోపాటు సుప్రీం కోర్టుతోపాటు ఇదే హైకోర్టు గతంలో వెలువరించిన పలు తీర్పులను ఆధారంగా చేసుకుని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.  

  • డ్రైవరు, వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు తేలితే వాహనం నడపడానికి అనుమతించరాదు. అతనితోపాటు మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వాహనాన్ని సీజ్ చేయకుండా ఆ వ్యక్తి తీసుకునేలా చూడాలి.
  • మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ మినహా వాహనంలో ఎవరూ లేకపోతే.. సంబంధిత పోలీసు అధికారి.. వాహనం తీసుకెళ్లడానికి సమీపంలోని డ్రైవర్​ బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వాలి.  
  • ఒకవేళ ఎవరూ రాని పక్షంలో పోలీసు అధికారులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని సమీప పోలీస్​ స్టేషన్​ లేదంటే అధీకృత స్థలంలో సురక్షితంగా ఉంచాలి.
  • మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారన్న కారణంగా వాహనాన్ని స్వాధీనం / జప్తు చేసుకునే అధికారం పోలీసులకు లేదు.  
  • స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఆర్సీ, గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు చూపిన యజమాని లేదా అధీకృత వ్యక్తికి అప్పగించాలి.
  • వాహనం డ్రైవరు, యజమాని లేదా ఇద్దరినీ ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులు నిర్ణయించిన పక్షంలో వాహనాన్ని సీజ్ చేసిన మూడు రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్ వద్ద అభియోగ పత్రం దాఖలు చేయాలి. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక ప్రాంతీయ రవాణా అధికారులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని విడుదల చేయాలి.
  • మేజిస్ట్రేట్లు వాహనాన్ని సీజ్ చేసిన మూడు రోజుల్లో అభియోగ పత్రాన్ని స్వీకరించాలి.
  • తెలంగాణ రాష్ట్ర మోటారు వాహనాల చట్టంలోని నిబంధన 448 ఏలో పేర్కొన్న విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
  • వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లని పక్షంలో పోలీసులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.
  • ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  

అయితే ఇప్పటికే ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్లలో కుప్పలు కుప్పలుగా వాహనాలు పేరుకుపోయాయి. కేసుల భయంతో కొందరు వాహనాలను సైతం వదులుకోగా... ఏం చేయాలో తెలియక కొందరు సందిగ్ధంలో పడ్డారు. గత డిసెంబర్ 31కి పట్టుబడిన వాహనాలే ఇంకా ఠాణాల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. 

ఇదీచూడండి: ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటుండగా ఫోన్‌లో చిత్రీకరణ.. ఆ తర్వాత..

Last Updated : Nov 6, 2021, 2:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.