ETV Bharat / city

Badvel by election: బద్వేలు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా...

author img

By

Published : Oct 7, 2021, 3:03 PM IST

బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేశ్​​ను ఎంపిక చేసినట్లు చేసినట్లు ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఏబీవీపీ తరఫున కడప జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన మంచి పేరు తెచ్చుకున్న సురేశ్​కు .. ఉప ఎన్నిక కలిసి వస్తుందని భావిస్తున్నారు.

Badvel by election
Badvel by election

బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేశ్​​ను ఎంపిక చేసినట్లు చేసినట్లు ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. భాజపా అభ్యర్థి సురేశ్​.. రేపు నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేశ్​.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున కడప జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన మంచి పేరు తెచ్చుకున్న సురేశ్​కు .. ఉప ఎన్నిక కలిసి వస్తుందని భావిస్తున్నారు.

అధికార పార్టీ నుంచి సుధ..

దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక (badvel by- election) అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున కమలమ్మ పోటీ చేయనున్నారు. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నికకు (badvel by- election) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుంది. బద్వేలు పరిధిలో 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి: Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్

బద్వేలు ఉప ఎన్నికలో (badvel by- election) భాజపా అభ్యర్థిగా పనతల సురేశ్​​ను ఎంపిక చేసినట్లు చేసినట్లు ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. భాజపా అభ్యర్థి సురేశ్​.. రేపు నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేశ్​.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున కడప జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన మంచి పేరు తెచ్చుకున్న సురేశ్​కు .. ఉప ఎన్నిక కలిసి వస్తుందని భావిస్తున్నారు.

అధికార పార్టీ నుంచి సుధ..

దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక (badvel by- election) అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున కమలమ్మ పోటీ చేయనున్నారు. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నికకు (badvel by- election) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరుగుతుంది. బద్వేలు పరిధిలో 2,16,139 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి: Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.