ETV Bharat / city

జీఎస్టీ ఎగవేత.. మూడేళ్లలో ఖజానాకు రూ.3 వేలకోట్లకు గండి

author img

By

Published : Mar 3, 2021, 7:44 AM IST

పన్ను రాబడులు తగ్గిన నేపథ్యంలో అందుకు దారితీసిన పరిస్థితులపై జీఎస్టీ అధికారులు అధ్యయనం చేశారు. సరకు అక్రమ రవాణా, పన్ను ఎగవేతలు వంటి పలు కారణాలు ఉన్నట్లు గుర్తించారు. గత మూడేళ్లలో జీఎస్టీ ఎగవేతతో సుమారు రూ.3 వేల కోట్లు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

GST evasion
జీఎస్టీ ఎగవేత.. మూడేళ్లలో ఖజానాకు రూ.3 వేలకోట్లకు గండి

రాష్ట్రంలో పన్ను చెల్లించకుండా సాగుతున్న కోట్ల రూపాయల వ్యాపారాలు, జీఎస్టీ ఎగవేత అక్రమాలు ఖజానాకు భారీగా గండికొడుతున్నాయి. రాబడులు తగ్గిన నేపథ్యంలో జీఎస్టీ అధికారులు అందుకు దారితీసిన అంశాలపై అధ్యయనం చేశారు. జీఎస్టీ చట్టంలోని వివిధ అవకాశాలను వినియోగించుకుని పలువురు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాహనాల తనిఖీలు తగ్గిన నేపథ్యలో యథేచ్ఛగా సరకుల అక్రమ రవాణాకు తెరతీసినట్లు గుర్తించారు. నిత్యం కోట్ల రూపాయల విలువైన వస్తువులు వివిధ రాష్ట్రాలను దాటి హైదరాబాద్‌కు చేరుతున్నట్లు వెల్లడైంది.

దిల్లీ, మహారాష్ట్ర నుంచి జీరో సరకులు

దిల్లీ నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్‌లు భారీగా అక్రమంగా రాష్ట్రానికి చేరుతున్నాయి. వాహనాలు రెండు మూడు రోజులు ప్రయాణించి రాష్ట్రానికి చేరుతున్నా ఎప్పుడో ఒకసారి గానీ పట్టుబడటంలేదు. గిడ్డంగులకు చేరేలోపే సరకును గుర్తిస్తే తప్ప పన్ను వసూలుకు అవకాశం ఉండటం లేదని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మూడు నెలల క్రితం దిల్లీ నుంచి మొబైల్‌ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాలతో నిండిన లారీని వాణిజ్య పన్నులశాఖ అధికారులు హైదరాబాద్‌లో పట్టుకున్నారు. లక్షల రూపాయల విలువైన సరకుకు ఎలాంటి బిల్లులు లేకపోగా, వేబిల్లు కూడా లేదు. మరో పదిహేను నిమిషాల్లో గిడ్డంగికి చేరుతుందనగా అధికారులు పట్టుకున్నారు.

మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా వివిధ ఉత్పత్తులు హైదరాబాద్‌కు చేరుతున్నాయి. జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులు తయారీ చేసే రాష్ట్రాలకు కాకుండా వస్తువులను వినియోగించే రాష్ట్రాలకు జీఎస్టీ అందుతుంది. ఈ నేపథ్యంలో జీరో వ్యాపారంతో వచ్చే సరుకులతో భారీగా జీఎస్టీ రాబడికి గండిపడుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఏటా సుమారు రూ.500 కోట్లకు పైగా జీరో వ్యాపారంతో పన్ను ఎగవేత జరుగుతున్నట్లుగా గుర్తించారు.

జీరో వ్యాపారం..

ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పాటు స్టీలులో జీరో వ్యాపారం హైదరాబాద్‌ కేంద్రంగా జోరుగా జరుగుతోందని గుర్తించారు. కేంద్ర జీఎస్టీలో పన్ను ఎగవేత అక్రమాలను గుర్తించేందుకు ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగం పన్ను ఎగవేత, నకిలీ వేబిల్లులు, అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకోవడం వంటి వ్యవహారాలను గుర్తిస్తోంది.

పన్ను స్వాహా..

మూడేళ్లుగా తెలంగాణ కేంద్రంగా రూ.3,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సీజీఎస్టీ అధికారులు అంచనా వేశారు. బోగస్‌ సంస్థల ఏర్పాటు, పన్ను చెల్లించకపోవడమే కాకుండా నకిలీ వేబిల్లులతో కోట్ల రూపాయలు ఐటీసీని అక్రమంగా తీసుకుంటున్నారు. మేడ్చల్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సీజీఎస్టీ అధికారుల పరిధిలో తరచూ ఇలాంటివి వెలుగు చూస్తునే ఉన్నాయి.ఇటీవల సికింద్రాబాద్‌ సీజీఎస్టీ పరిధిలో ఆరు బోగస్‌ సంస్థలను ఏర్పాటు చేసి నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.48.99 కోట్లు ఐటీసీ తీసుకున్న ఘటన వెలుగు చూసింది. మేడ్చల్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.69 కోట్ల పన్ను స్వాహా వ్యవహారం బయటపడింది.

ఇవీచూడండి: ఈ నెల మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రంలో పన్ను చెల్లించకుండా సాగుతున్న కోట్ల రూపాయల వ్యాపారాలు, జీఎస్టీ ఎగవేత అక్రమాలు ఖజానాకు భారీగా గండికొడుతున్నాయి. రాబడులు తగ్గిన నేపథ్యంలో జీఎస్టీ అధికారులు అందుకు దారితీసిన అంశాలపై అధ్యయనం చేశారు. జీఎస్టీ చట్టంలోని వివిధ అవకాశాలను వినియోగించుకుని పలువురు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వాహనాల తనిఖీలు తగ్గిన నేపథ్యలో యథేచ్ఛగా సరకుల అక్రమ రవాణాకు తెరతీసినట్లు గుర్తించారు. నిత్యం కోట్ల రూపాయల విలువైన వస్తువులు వివిధ రాష్ట్రాలను దాటి హైదరాబాద్‌కు చేరుతున్నట్లు వెల్లడైంది.

దిల్లీ, మహారాష్ట్ర నుంచి జీరో సరకులు

దిల్లీ నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్‌లు భారీగా అక్రమంగా రాష్ట్రానికి చేరుతున్నాయి. వాహనాలు రెండు మూడు రోజులు ప్రయాణించి రాష్ట్రానికి చేరుతున్నా ఎప్పుడో ఒకసారి గానీ పట్టుబడటంలేదు. గిడ్డంగులకు చేరేలోపే సరకును గుర్తిస్తే తప్ప పన్ను వసూలుకు అవకాశం ఉండటం లేదని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మూడు నెలల క్రితం దిల్లీ నుంచి మొబైల్‌ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాలతో నిండిన లారీని వాణిజ్య పన్నులశాఖ అధికారులు హైదరాబాద్‌లో పట్టుకున్నారు. లక్షల రూపాయల విలువైన సరకుకు ఎలాంటి బిల్లులు లేకపోగా, వేబిల్లు కూడా లేదు. మరో పదిహేను నిమిషాల్లో గిడ్డంగికి చేరుతుందనగా అధికారులు పట్టుకున్నారు.

మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా వివిధ ఉత్పత్తులు హైదరాబాద్‌కు చేరుతున్నాయి. జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులు తయారీ చేసే రాష్ట్రాలకు కాకుండా వస్తువులను వినియోగించే రాష్ట్రాలకు జీఎస్టీ అందుతుంది. ఈ నేపథ్యంలో జీరో వ్యాపారంతో వచ్చే సరుకులతో భారీగా జీఎస్టీ రాబడికి గండిపడుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఏటా సుమారు రూ.500 కోట్లకు పైగా జీరో వ్యాపారంతో పన్ను ఎగవేత జరుగుతున్నట్లుగా గుర్తించారు.

జీరో వ్యాపారం..

ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పాటు స్టీలులో జీరో వ్యాపారం హైదరాబాద్‌ కేంద్రంగా జోరుగా జరుగుతోందని గుర్తించారు. కేంద్ర జీఎస్టీలో పన్ను ఎగవేత అక్రమాలను గుర్తించేందుకు ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగం పన్ను ఎగవేత, నకిలీ వేబిల్లులు, అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకోవడం వంటి వ్యవహారాలను గుర్తిస్తోంది.

పన్ను స్వాహా..

మూడేళ్లుగా తెలంగాణ కేంద్రంగా రూ.3,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సీజీఎస్టీ అధికారులు అంచనా వేశారు. బోగస్‌ సంస్థల ఏర్పాటు, పన్ను చెల్లించకపోవడమే కాకుండా నకిలీ వేబిల్లులతో కోట్ల రూపాయలు ఐటీసీని అక్రమంగా తీసుకుంటున్నారు. మేడ్చల్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సీజీఎస్టీ అధికారుల పరిధిలో తరచూ ఇలాంటివి వెలుగు చూస్తునే ఉన్నాయి.ఇటీవల సికింద్రాబాద్‌ సీజీఎస్టీ పరిధిలో ఆరు బోగస్‌ సంస్థలను ఏర్పాటు చేసి నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.48.99 కోట్లు ఐటీసీ తీసుకున్న ఘటన వెలుగు చూసింది. మేడ్చల్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.69 కోట్ల పన్ను స్వాహా వ్యవహారం బయటపడింది.

ఇవీచూడండి: ఈ నెల మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.