ETV Bharat / city

సీఎం కేసీఆర్​ను కలిసిన నామినేటెడ్​ ఎమ్మెల్సీలు

author img

By

Published : Nov 13, 2020, 10:25 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ను నామినేటెడ్​ ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్​ కలిశారు. తమను పెద్దల సభకు పంపుతున్నందుకు స్వయంగా కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్​ను కలిసిన నామినేటెడ్​ ఎమ్మెల్సీలు
సీఎం కేసీఆర్​ను కలిసిన నామినేటెడ్​ ఎమ్మెల్సీలు

నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్... ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్​కు వెళ్లి సీఎంను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని అభినందించారు. శాలువాలతో సత్కరించారు.

అత్యంత వెనకబడిన కులానికి చెందిన తనను నామినేటెడ్ కోటా ద్వారా పెద్దల సభకు పంపడం గొప్ప గౌరవమన్న సారయ్య... బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపాపు. సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... పార్టీ గౌరవాన్ని పెంపొందించేలా ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?

నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఖరారైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్... ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్​కు వెళ్లి సీఎంను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని అభినందించారు. శాలువాలతో సత్కరించారు.

అత్యంత వెనకబడిన కులానికి చెందిన తనను నామినేటెడ్ కోటా ద్వారా పెద్దల సభకు పంపడం గొప్ప గౌరవమన్న సారయ్య... బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపాపు. సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... పార్టీ గౌరవాన్ని పెంపొందించేలా ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.