ETV Bharat / city

'ఆ ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోరు'

author img

By

Published : Feb 27, 2021, 8:50 PM IST

మియాపూర్ మదీనగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు మంజుల సుభద్ర పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Mp Ranjithreddy On Teacher manjula subhadra Retirement programme at madeenaguda government school
'ఆ ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోరు'

ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శకులుగా నిలిచిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మంజుల సుభద్ర పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం మియాపూర్ మదీనగూడలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

ఉపాధ్యాయ వృత్తిలో మంజుల సుభద్ర చేసిన సేవలను రంజిత్ ​రెడ్డి ప్రశంసించారు. విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలు చూపుతూ.. విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్‌తో పాటు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శకులుగా నిలిచిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మంజుల సుభద్ర పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం మియాపూర్ మదీనగూడలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

ఉపాధ్యాయ వృత్తిలో మంజుల సుభద్ర చేసిన సేవలను రంజిత్ ​రెడ్డి ప్రశంసించారు. విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలు చూపుతూ.. విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్‌తో పాటు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి: జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం... ఫోన్లలో అభ్యర్థుల ప్రసన్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.