ETV Bharat / city

RRR letter to amitshah: అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ

కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు వైకాపా ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఏపీలో మూడు రాజధానుల సమస్య, ఆర్థిక స్థితిగతులను లేఖలో పేర్కొన్నారు. 3 రాజధానులపై కేంద్రం స్పందించాలని కోరారు.

author img

By

Published : Jul 18, 2021, 4:29 PM IST

RRR letter to amitshah
అమిత్ షాకు రఘురామ లేఖ

ఏపీకి మూడు రాజధానులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీ సవరణ కుదరదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే.. పార్లమెంటులోనే చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే.. రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నామని వివరించారు.

జల వివాదం మాదిరిగానే 3 రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు వచ్చాయని.. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఏపీకి మూడు రాజధానులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీ సవరణ కుదరదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయాలంటే.. పార్లమెంటులోనే చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే.. రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నామని వివరించారు.

జల వివాదం మాదిరిగానే 3 రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు వచ్చాయని.. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వరద బాధితులకు సాయమందించాలి.. కేటీఆర్​కు శ్రవణ్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.