ETV Bharat / city

'తల్లి పాత్ర సరిగ్గా లేకుండా.. పోలీసులదే బాధ్యతంటే ఎలా' - తానేటి వనిత తాాజా వార్తలు

సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లి పాత్ర కీలకమని ఏపీ హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. తల్లి సరైన పాత్ర పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు తల్లి రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలన్నారు.

Home Minister Vanitha
హోం మంత్రి తానేటి వనిత
author img

By

Published : May 1, 2022, 6:02 PM IST

Updated : May 1, 2022, 6:13 PM IST

సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని.. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర కీలకమని హోం మంత్రి వనిత వ్యాఖ్యానించారు. తల్లి ఆడబిడ్డలకు రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని.. ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలని అన్నారు. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీ విశాఖలో దిశ పోలీస్ స్టేషన్​ను పరిశీలించిన ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు.

"ఈ తప్పు ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తే చాలా కారణాలున్నాయి. అసలు తప్పు చేసే వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో ఏవిధంగా ఉంటున్నారు. అలాంటప్పుడు నేను తల్లిగా చెబుతున్నాను. ఆడబిడ్డల సంరక్షణ తండ్రి కంటే తల్లిదే ఎక్కువ బాధ్యత. కనుక మనం వాళ్లను కాపాడుకోవాలి. తల్లి బిడ్డను కంటిరెప్పలా కాపాడుకోవాలి. అప్పుడే ఈ అఘ్యాత్యాలను నివారించగలం. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదు."

- తానేటి వనిత హోం మంత్రి

ఆ ఘటన ఏ తల్లి పెంపకం తప్పో చెప్పాలి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత డిమాండ్ చేశారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తున్నారని ఆమె మండిపడ్డారు. రేపల్లెలో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలన్నారు. ఒక ఆడది అయ్యుండి మరో తల్లిగురించి నీచంగా మాట్లాడటం బాధాకరమన్నారు. అసమర్థ పాలనను తల్లుల పెంపకంపై నెట్టే స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. జగన్ మూగ సీఎంలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తల్లి పాత్ర సరిగ్గా లేకుండా.. పోలీసులదే బాధ్యతంటే ఎలా

ఇదీ చదవండి: 'రాహుల్‌గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్​కు ఎందుకు భయం'

నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​గా సుమన్​ బేరీ

సమాజంలో ఆడబిడ్డలపై దాడులు జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని.. మరీ ముఖ్యంగా తల్లి పాత్ర కీలకమని హోం మంత్రి వనిత వ్యాఖ్యానించారు. తల్లి ఆడబిడ్డలకు రక్షణగా ఉండి సంరక్షణ ఇవ్వాలని.. ఎలాంటి అఘాయిత్యాలూ జరగకుండా చూసుకోవాలని అన్నారు. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీ విశాఖలో దిశ పోలీస్ స్టేషన్​ను పరిశీలించిన ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు.

"ఈ తప్పు ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తే చాలా కారణాలున్నాయి. అసలు తప్పు చేసే వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో ఏవిధంగా ఉంటున్నారు. అలాంటప్పుడు నేను తల్లిగా చెబుతున్నాను. ఆడబిడ్డల సంరక్షణ తండ్రి కంటే తల్లిదే ఎక్కువ బాధ్యత. కనుక మనం వాళ్లను కాపాడుకోవాలి. తల్లి బిడ్డను కంటిరెప్పలా కాపాడుకోవాలి. అప్పుడే ఈ అఘ్యాత్యాలను నివారించగలం. తల్లి పాత్ర సరిగ్గా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదు."

- తానేటి వనిత హోం మంత్రి

ఆ ఘటన ఏ తల్లి పెంపకం తప్పో చెప్పాలి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత డిమాండ్ చేశారు. తల్లులను బయటికి తీసుకొచ్చి హోంమంత్రి కించపరుస్తున్నారని ఆమె మండిపడ్డారు. రేపల్లెలో అత్యాచారం ఘటన ఏ తల్లి పెంపకం తప్పో హోంమంత్రి చెప్పాలన్నారు. ఒక ఆడది అయ్యుండి మరో తల్లిగురించి నీచంగా మాట్లాడటం బాధాకరమన్నారు. అసమర్థ పాలనను తల్లుల పెంపకంపై నెట్టే స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. మహిళలపై వరుసగా ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. జగన్ మూగ సీఎంలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తల్లి పాత్ర సరిగ్గా లేకుండా.. పోలీసులదే బాధ్యతంటే ఎలా

ఇదీ చదవండి: 'రాహుల్‌గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్​కు ఎందుకు భయం'

నీతి ఆయోగ్​ వైస్​ ఛైర్మన్​గా సుమన్​ బేరీ

Last Updated : May 1, 2022, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.