ETV Bharat / city

శుభాకాంక్షలు వద్దు.. మొక్క నాటండి చాలు : మంత్రి తలసాని

author img

By

Published : Oct 6, 2020, 12:07 PM IST

పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పడానికి రావద్దని.. బదులుగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్​ కుమార్​ చేపట్టిన గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటారు.

Minister Talasani Participated in Green Challenge On The Occasion of His Birth day
శుభాకాంక్షలు వద్దు.. మొక్క నాటండి చాలు : మంత్రి తలసాని

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్​ - 19 నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు చెప్పడానికి నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దని.. అందుకు బదులుగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు నాటాలని కోరారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్​ కుమార్​ చేపట్టిన గ్రీన్​ ఛాలెంజ్​లో పాల్గొని పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో మొక్కలు నాటారు. పలువురు తెరాస నాయకులు, మంత్రులు, అభిమానులు ఆయనకు ఫోన్​లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్​ - 19 నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు చెప్పడానికి నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావద్దని.. అందుకు బదులుగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు నాటాలని కోరారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్​ కుమార్​ చేపట్టిన గ్రీన్​ ఛాలెంజ్​లో పాల్గొని పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో మొక్కలు నాటారు. పలువురు తెరాస నాయకులు, మంత్రులు, అభిమానులు ఆయనకు ఫోన్​లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: 'పరిహార సెస్సు గడువు పొడిగింపునకు అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.