మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలలో రెండు పడక గదుల ఇళ్ల పత్రాలు మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. 61 మంది దరఖాస్తు చేసుకోగా... 40 ఇళ్లు మాత్రమే ఉండటం వల్ల లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో పేరు రాలేదని... శ్రీకాంత్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తమై... అతడిని స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: 'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం'