ETV Bharat / city

రెండు లారీలు ఢీ... క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ - accident

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని నాలుగు గంటలు శ్రమించి ఆయన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

lorry-accidnet-in-east-godavari-district in ap
రెండు లారీలు ఢీ... క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​
author img

By

Published : Jul 21, 2020, 6:45 PM IST

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి గ్యాస్​ లోడుతో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ దుర్ఘటనలో గ్యాస్​ లారీ క్యాబిన్​లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు.

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లారీ డ్రైవర్​ను తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 4 గంటలు కష్టపడి డ్రైవరును బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు దోనపాటి చంటి (40 ) ఐ.పోలవరం మండలంలోని టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని... ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి గ్యాస్​ లోడుతో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ దుర్ఘటనలో గ్యాస్​ లారీ క్యాబిన్​లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు.

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లారీ డ్రైవర్​ను తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 4 గంటలు కష్టపడి డ్రైవరును బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు దోనపాటి చంటి (40 ) ఐ.పోలవరం మండలంలోని టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని... ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఇవీ చూడండి: సెల్ఫీ వైరల్: 'నేను చచ్చిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.