పిల్లలకు బడి మీద భయాన్ని పోగొట్టేద్దామిలా.... - schools reopen latest news
రెండు మూడు రోజుల పాటు ఇంటి దగ్గర ఉంటేనే బడికి వెళ్లేందుకు మారాం చేసే పిల్లలు.. దాదాపు 10 నెలల సెలవు దినాల తర్వాత పాఠశాలలకు పంపించటమంటే గగనమే. బడంటే పిల్లలకు ఏర్పడిన భయాన్ని విద్యార్థుల్లోంచి తొలగించటం కాస్తా కష్టమైన పనే అయినప్పటికీ... కొన్ని పనులు చేయటం వల్ల ఆ భీతిని తొలగించ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి...
Let's get rid of the fear of children in school ....
By
Published : Jan 31, 2021, 10:58 AM IST
|
Updated : Jan 31, 2021, 11:05 AM IST
సంక్రాంతి... వేసవి ఇలా వరుసగా సెలవులు వస్తే పిల్లలు తిరిగి బడికి వెళ్లేందుకు మారాం చేస్తారు. కుంటి సాకులతో పాఠశాల ఎగ్గొట్టేందుకు పథకం వేస్తారు. దాదాపు 10 నెలల విరామం తర్వాత విద్యాలయాలు తెరుచుకోనున్నాయి. గ్రేటర్ పరిధిలో 9వ తరగతి నుంచి తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సమ్మతి తీసుకుంటున్నారు.ఇటువంటి కీలకమైన సమయంలో పిల్లలకు బడి పట్ల భయాన్ని దూరం చేసి మానసికంగా సిద్ధం చేయటం ఉత్తమమార్గమని కౌన్సెలింగ్ సైకాలజిస్టు ఎం.రాంచందర్ సూచిస్తున్నారు.
అడ్డంకులు
* కరోనా కారణంగా తలెత్తిన సంఘర్షణ, భయం, ఆందోళన
* ఇంత వరకూ ఉన్న అయోమయం వల్ల విసుగు, నిస్సహాయ స్థితి ● దైనందిన వ్యవహారాల్లో మార్పులు
* ఈ స్థితిలో మెదడులో కార్టిజాల్ స్థాయి పెరిగి ఒత్తిడికి కారణమవుతుంది
* పాఠశాలకు దూరమై సుదీర్ఘవిరామం తరువాత వెళ్లటం ఒత్తిడిని పెంచుతుంది.
ఇలా అధిగమిద్దాం
* విద్యార్థులు వీటిని అధిగమించేందుకు ఆన్లైన్ తరగతులు కొంతమేర ఉపకరించాయి
* ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో సమయాన్ని వృథా చేయకుండా ఆసక్తి/ఇష్టంతో చదవాలి.
* చదివేటపుడు తప్పనిసరిగా విరామం ఉండాలి.
* అధ్యయన అలవాట్లను పెంపొందించుకోవాలి
* ఉదయం/సాయంత్రం ఏదో ఒక సమయంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.
* భవిష్యత్తుపై సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లాలి. జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను ఆలోచనలను దూరం చేయాలి.
అమ్మానాన్నల పాత్ర
* ఇన్నాళ్లు ఇంటివద్దనే ఉన్న పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి
సంక్రాంతి... వేసవి ఇలా వరుసగా సెలవులు వస్తే పిల్లలు తిరిగి బడికి వెళ్లేందుకు మారాం చేస్తారు. కుంటి సాకులతో పాఠశాల ఎగ్గొట్టేందుకు పథకం వేస్తారు. దాదాపు 10 నెలల విరామం తర్వాత విద్యాలయాలు తెరుచుకోనున్నాయి. గ్రేటర్ పరిధిలో 9వ తరగతి నుంచి తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సమ్మతి తీసుకుంటున్నారు.ఇటువంటి కీలకమైన సమయంలో పిల్లలకు బడి పట్ల భయాన్ని దూరం చేసి మానసికంగా సిద్ధం చేయటం ఉత్తమమార్గమని కౌన్సెలింగ్ సైకాలజిస్టు ఎం.రాంచందర్ సూచిస్తున్నారు.
అడ్డంకులు
* కరోనా కారణంగా తలెత్తిన సంఘర్షణ, భయం, ఆందోళన
* ఇంత వరకూ ఉన్న అయోమయం వల్ల విసుగు, నిస్సహాయ స్థితి ● దైనందిన వ్యవహారాల్లో మార్పులు
* ఈ స్థితిలో మెదడులో కార్టిజాల్ స్థాయి పెరిగి ఒత్తిడికి కారణమవుతుంది
* పాఠశాలకు దూరమై సుదీర్ఘవిరామం తరువాత వెళ్లటం ఒత్తిడిని పెంచుతుంది.
ఇలా అధిగమిద్దాం
* విద్యార్థులు వీటిని అధిగమించేందుకు ఆన్లైన్ తరగతులు కొంతమేర ఉపకరించాయి
* ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో సమయాన్ని వృథా చేయకుండా ఆసక్తి/ఇష్టంతో చదవాలి.
* చదివేటపుడు తప్పనిసరిగా విరామం ఉండాలి.
* అధ్యయన అలవాట్లను పెంపొందించుకోవాలి
* ఉదయం/సాయంత్రం ఏదో ఒక సమయంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.
* భవిష్యత్తుపై సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లాలి. జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను ఆలోచనలను దూరం చేయాలి.
అమ్మానాన్నల పాత్ర
* ఇన్నాళ్లు ఇంటివద్దనే ఉన్న పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి