ETV Bharat / city

మూడేళ్లుగా ఫేస్​బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి

author img

By

Published : Nov 21, 2021, 1:05 PM IST

ఫేస్​బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ మహిళకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న నిజం తెలుసుకున్న వ్యక్తి ఆమెకు దూరంగా జరగాలనుకున్నాడు. కానీ.. ఆ మహిళ అందుకు ఒప్పుకోలేదు. అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. యాసిడ్​ దాడి(kerala acid attack) చేసి.. అతని కంటిచూపు పోగొట్టింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముఖం నిండా గాయలపాలైన తను ఊచలు లెక్కించేందుకు సిద్ధంగా ఉంది.

మూడేళ్లుగా ఫేస్​బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి
మూడేళ్లుగా ఫేస్​బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి

తనను కాదన్నాడనే అక్కసుతో ఓ వ్యక్తిపై యాసిడ్‌ దాడికి(acid attack kerala) దిగిందో మహిళ. కేరళలో జరిగిన ఈ దారుణ ఘటనలో బాధిత వ్యక్తి కంటి చూపు కోల్పోయాడు.

ఫేస్​బుక్​లో మూడేళ్లు..

తిరువనంతపురంలో నర్సుగా పనిచేస్తున్న 36ఏళ్ల షీబాకు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా అరుణ్‌ కుమార్​తో పరిచయమైంది. కొన్నాళ్ల స్నేహం అనంతరం షీబాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్న అరుణ్ ఆమెతో విడిపోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇతర మహిళలతో చనువుగా ఉంటున్నాడు. ఇది తెలిసి షీబా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో కొన్నాళ్లుగా ఇద్దరూ సరిగా మాట్లాడుకోవట్లేదు.

ఈ క్రమంలోనే అరుణ్​ని ఆదిమలిలోని ఓ చర్చికి రావాల్సిందిగా కోరింది. మాట్లాడుతుండగానే.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్​ను అరుణ్​ ముఖంపై పోసింది (acid attack latest news). ఆ సమయంలో తన ముఖంపైనా యాసిడ్ పడటంతో గాయాలపాలైంది.

కంటిచూపు కోల్పోయి..

తనపై యాసిడ్ దాడి(kerala acid attack) జరగ్గానే అరుణ్ కుమార్ తన స్నేహితుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లాడు. ప్రస్తుతం తిరువనంతపురం మెడికల్ కాలేజీలో (thiruvananthapuram medical college) చికిత్స పొందుతున్నాడు. 'ముఖంపై యాసిడ్ పడటంతో ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయాడని' వైద్యులు తెలిపారు.

'దీనిపై తమకు ఫిర్యాదు అందనందువల్ల కేసు నమోదు చేయలేదని' పోలీసులు(kerala police) తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరోవైపు.. షీబా ముఖంపై ఉన్న యాసిడ్ మచ్చలను దాచేందుకు ఆమె భర్త ప్రయత్నించాడు. అవి ప్రమాదవశాత్తు అయిన గాయాలేనని భర్త తరఫు కుటుంబసభ్యులు తెలపడం గమనార్హం.

తనను కాదన్నాడనే అక్కసుతో ఓ వ్యక్తిపై యాసిడ్‌ దాడికి(acid attack kerala) దిగిందో మహిళ. కేరళలో జరిగిన ఈ దారుణ ఘటనలో బాధిత వ్యక్తి కంటి చూపు కోల్పోయాడు.

ఫేస్​బుక్​లో మూడేళ్లు..

తిరువనంతపురంలో నర్సుగా పనిచేస్తున్న 36ఏళ్ల షీబాకు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా అరుణ్‌ కుమార్​తో పరిచయమైంది. కొన్నాళ్ల స్నేహం అనంతరం షీబాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్న అరుణ్ ఆమెతో విడిపోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇతర మహిళలతో చనువుగా ఉంటున్నాడు. ఇది తెలిసి షీబా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో కొన్నాళ్లుగా ఇద్దరూ సరిగా మాట్లాడుకోవట్లేదు.

ఈ క్రమంలోనే అరుణ్​ని ఆదిమలిలోని ఓ చర్చికి రావాల్సిందిగా కోరింది. మాట్లాడుతుండగానే.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్​ను అరుణ్​ ముఖంపై పోసింది (acid attack latest news). ఆ సమయంలో తన ముఖంపైనా యాసిడ్ పడటంతో గాయాలపాలైంది.

కంటిచూపు కోల్పోయి..

తనపై యాసిడ్ దాడి(kerala acid attack) జరగ్గానే అరుణ్ కుమార్ తన స్నేహితుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లాడు. ప్రస్తుతం తిరువనంతపురం మెడికల్ కాలేజీలో (thiruvananthapuram medical college) చికిత్స పొందుతున్నాడు. 'ముఖంపై యాసిడ్ పడటంతో ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయాడని' వైద్యులు తెలిపారు.

'దీనిపై తమకు ఫిర్యాదు అందనందువల్ల కేసు నమోదు చేయలేదని' పోలీసులు(kerala police) తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరోవైపు.. షీబా ముఖంపై ఉన్న యాసిడ్ మచ్చలను దాచేందుకు ఆమె భర్త ప్రయత్నించాడు. అవి ప్రమాదవశాత్తు అయిన గాయాలేనని భర్త తరఫు కుటుంబసభ్యులు తెలపడం గమనార్హం.

For All Latest Updates

TAGGED:

dum
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.