ETV Bharat / city

'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరాలు'

author img

By

Published : Jan 4, 2021, 7:23 PM IST

ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలను సీఎం ప్రవేశపెట్టారని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్​ నామాలగుండులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

deputy speaker teegulla padmarao goud
చెక్కులు పంపిణీ చేసిన ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్​

పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్​లోని పలు డివిజన్లలో కోటికిపైగా విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎమ్​ఆర్ఎఫ్​ చెక్కులను నామాలగుండులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలోని సీతాఫల్​మండీ, బౌద్ధనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు చెందిన 120 మందికి చెక్కులు అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు.

డబ్బులు ఇవ్వొద్దు:

లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ కార్యాలయం నంబర్లకు ఫోన్ చేయాలని పద్మారావు గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు జానకి, సునీల్ కుమార్, తెరాస యువనేతలు కిశోర్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


ఇదీ చూడండి: 'గొలుసుకట్టు వ్యాపారంలో కోట్లు కట్టించి మోసపోయాం'

పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్​లోని పలు డివిజన్లలో కోటికిపైగా విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎమ్​ఆర్ఎఫ్​ చెక్కులను నామాలగుండులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలోని సీతాఫల్​మండీ, బౌద్ధనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు చెందిన 120 మందికి చెక్కులు అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు.

డబ్బులు ఇవ్వొద్దు:

లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ కార్యాలయం నంబర్లకు ఫోన్ చేయాలని పద్మారావు గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు జానకి, సునీల్ కుమార్, తెరాస యువనేతలు కిశోర్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


ఇదీ చూడండి: 'గొలుసుకట్టు వ్యాపారంలో కోట్లు కట్టించి మోసపోయాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.