ETV Bharat / city

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం

వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాబోయే రోజుల్ని తలచుకుంటూ మురిసిపోయారు. కానీ.. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. నూతన దంపతులతో పాటు వధువు సోదరుడు దుర్మరణం పాలయ్యాడు.

author img

By

Published : Jun 18, 2020, 8:02 PM IST

in-a-road-accident-three-men-death-in-poolla-west-godavari-district
రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలటం వల్ల కారు అదుపు తప్పి డివైడర్​ను దాటి అవతలి వైపు నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టింది.

ప్రమాదంలో కారులో ఉన్న నవదంపతులతోపాటు వధువు సోదరుడు మృతి చెందారు. వీరు తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలటం వల్ల కారు అదుపు తప్పి డివైడర్​ను దాటి అవతలి వైపు నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టింది.

ప్రమాదంలో కారులో ఉన్న నవదంపతులతోపాటు వధువు సోదరుడు మృతి చెందారు. వీరు తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి : హాజరు కాలేని విషాద పరిస్థితులు.. బరువెక్కిన హృదయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.