ETV Bharat / city

Exams: 'పరీక్ష ఫలితాలకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ'

author img

By

Published : Jun 26, 2021, 7:34 PM IST

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయంతో ఫలితాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.

high level expert committee for exam results news
పరీక్ష ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ

ఆంధ్రపదేశ్​లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల రద్దు నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పరీక్షా ఫలితాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యా కానుక అమలు అంశాలపైనా సమావేశంలో మంత్రి సురేశ్​ చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారీ, పాఠశాలలు తెరిచే అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన, విద్యాకానుక అమలు కార్యచరణపై మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడారు.

ఇదీ చదవండి: offline classes: ప్రత్యక్ష తరగతులు వాయిదా..సీఎం కేసీఆర్ నిర్ణయం

ఆంధ్రపదేశ్​లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల రద్దు నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పరీక్షా ఫలితాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫలితాల కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యా కానుక అమలు అంశాలపైనా సమావేశంలో మంత్రి సురేశ్​ చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారీ, పాఠశాలలు తెరిచే అంశంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన, విద్యాకానుక అమలు కార్యచరణపై మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడారు.

ఇదీ చదవండి: offline classes: ప్రత్యక్ష తరగతులు వాయిదా..సీఎం కేసీఆర్ నిర్ణయం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.