Case Filed Against Hero Venkatesh And Family : సినీ నటుడు వెంకటేశ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. హైదరాబాద్ ఫిల్మ్నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్ బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఫిల్మ్నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఏం జరిగింది అంటే? : గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బాధితుడిగా ఉన్న నందకుమార్కు చెందిన దక్కన్ కిచన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం పెరిగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబరులో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా కూల్చివేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ప్రతి సండే స్టేషన్కు వెళ్లనక్కర్లేదు - నాంపల్లి కోర్టులో అల్లుఅర్జున్కు ఊరట
హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్ను పూర్తిగా కూల్చేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు శనివారం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాంపల్లిలో 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని, కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
'ఫన్ బకెట్ భార్గవ్’కు 20 ఏళ్ల జైలు శిక్ష - బాలికపై అత్యాచారం కేసులో కోర్టు తీర్పు