ETV Bharat / city

Weather: రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడ పిడుగులు..భారీ వర్షాలు

author img

By

Published : Jun 2, 2021, 8:44 PM IST

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు, రైతులు‌, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో‌ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

disaster management
disaster management

రాగల నాలుగైదు గంటల్లో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో‌ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో‌ అక్కడక్కడ తేలికపాటి నుంచి‌ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

గురువారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో‌ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు‌, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది.

ఇదీ చదవండీ: DIGITAL SURVEY: జూన్‌ 11 నుంచి పైలట్‌ విధానంలో డిజిటల్‌ భూసర్వే

రాగల నాలుగైదు గంటల్లో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో‌ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో‌ అక్కడక్కడ తేలికపాటి నుంచి‌ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

గురువారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో‌ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు‌, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది.

ఇదీ చదవండీ: DIGITAL SURVEY: జూన్‌ 11 నుంచి పైలట్‌ విధానంలో డిజిటల్‌ భూసర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.