ప్రసవ సమయంలో, ఇతర శస్త్ర చికిత్స సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మరణిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దీన్ని నివారించాలంటే రక్తదాన శిబిరాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని సయెంట్, రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె సందర్శించారు. రక్తదానం చేసిన ఉద్యోగులను అభినందించారు.
రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖలో 16 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శిబిరంలో దాదాపు 500 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.
ఇవీ చూడండి: అమ్మకానికి మహవీర్ హరిణ జాతీయ పార్క్!