ETV Bharat / city

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలి: గవర్నర్​ - governor speaks on blood donation

ప్రతి ఒక్కరూ రక్తదాతలు కావాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆకాంక్షించారు. కాన్సర్ అవగాహన కోసం కూకట్​పల్లి ఇస్కాన్​, జేఎన్​టీయూహెచ్​, ఎన్​ఎస్​ఎస్​ సంయుక్తంగా నిర్వహించిన 'కిల్​ కాన్సర్'​ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

governor speaks on blood donation in cancer awareness program
రక్తదానం చేసేందుకు విద్యార్థులు ముందురావాలి: గవర్నర్​
author img

By

Published : Dec 18, 2019, 8:11 PM IST

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలి: గవర్నర్​

ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కోరారు. తాను తెలంగాణ గవర్నర్​గా పదవి స్వీకరించే సమయానికి రాష్ట్రంలో డెంగీ విజృంభణ కొనసాగుతోందని... సరైన సమయంలో ప్లేట్లెట్స్​ ఎక్కించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. వ్యాధిగ్రస్తుల రక్త సంబంధికులు రక్తదానం చేయడానికి నిరాకరిస్తున్న సందర్భంలో.. రక్తదానం చేస్తున్న వారిని చూస్తే గర్వంగా ఉంటుందని ఆమె అన్నారు.

జేఎన్​టీయూహెచ్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది రక్తదానం చేశారు. రక్తదాతలతో ముచ్చటించిన తమిళిసై వారందరిని అభినందించారు. కాన్సర్​ అవగాహనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి గవర్నర్​ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

కళాప్రదర్శనలలో అత్యాచారాలు, యాసిడ్ దాడులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. పోషకాహారలోపంపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. కాన్సర్​ను సరైన సమయంలో గుర్తిస్తే నివారించవచ్చునని తెలిపారు. దాడుల నుంచి రక్షణ కోసం మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు.

ఇవీచూడండి: అత్యాచార కేసులపై రాష్ట్రాలను నివేదికలు కోరిన సుప్రీం

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలి: గవర్నర్​

ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కోరారు. తాను తెలంగాణ గవర్నర్​గా పదవి స్వీకరించే సమయానికి రాష్ట్రంలో డెంగీ విజృంభణ కొనసాగుతోందని... సరైన సమయంలో ప్లేట్లెట్స్​ ఎక్కించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. వ్యాధిగ్రస్తుల రక్త సంబంధికులు రక్తదానం చేయడానికి నిరాకరిస్తున్న సందర్భంలో.. రక్తదానం చేస్తున్న వారిని చూస్తే గర్వంగా ఉంటుందని ఆమె అన్నారు.

జేఎన్​టీయూహెచ్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది రక్తదానం చేశారు. రక్తదాతలతో ముచ్చటించిన తమిళిసై వారందరిని అభినందించారు. కాన్సర్​ అవగాహనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి గవర్నర్​ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

కళాప్రదర్శనలలో అత్యాచారాలు, యాసిడ్ దాడులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. పోషకాహారలోపంపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్​ అభిప్రాయపడ్డారు. కాన్సర్​ను సరైన సమయంలో గుర్తిస్తే నివారించవచ్చునని తెలిపారు. దాడుల నుంచి రక్షణ కోసం మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు.

ఇవీచూడండి: అత్యాచార కేసులపై రాష్ట్రాలను నివేదికలు కోరిన సుప్రీం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.