ETV Bharat / city

Raja Singh Controversy: 'యూపీలో భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు'

author img

By

Published : Feb 15, 2022, 12:07 PM IST

Raja Singh Controversy : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికల పోలింగ్​లో భాజపాకు ఓటు వేయని వారి ఇళ్లపైకి బుల్డోజర్లను, జేసీబీలను పంపిస్తామని హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయని వాళ్లంతా యూపీ నుంచి వెళ్లిపోవాలని అన్నారు.

Raja Singh Controversy
Raja Singh Controversy

Raja Singh Controversy : భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సంచలనం సృష్టించారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్​కు మద్దతివ్వని వారిని హెచ్చరించారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తర్వాత.. భాజపాకు ఓటు వేయని వారి జాబితా తీసి.. వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని హెచ్చరించారు. ఇందుకోసమే యోగి.. వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని వ్యాఖ్యానించారు.

యూపీలో ఉండాలంటే.. యోగిని గెలిపించాల్సిందే..

Raja Singh Controversy on UP Elections : ఉత్తర్​ప్రదేశ్​లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ అన్నారు. భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. భాజపా శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు. ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి.. యోగి సర్కార్​ రావాలని ఆకాంక్షించారు.

"ఉత్తర్​ ప్రదేశ్​లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలి. అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేసి మరోసారి గెలిపించాలి. కొందరు యోగి మళ్లీ సీఎం కాకూడదని కుట్రలు పన్నుతున్నారు. వాళ్లకి నేను చెప్పేదొకటే.. యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి రప్పించారు. మూడో దశ పోలింగ్​లో భాజపాకు ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం. వాళ్ల అందరికి ఇళ్లపైకి ఈ బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం. మీకు తెలుసుగా.. ఇవి ఏం చేస్తాయో. యూపీలో ఉండాలంటే.. జై యోగి ఆదిత్యనాథ్ అనాల్సిందే. భాజపాకు జై కొట్టాల్సిందే. లేకపోతే.. ఉత్తర్​ ప్రదేశ్​ నుంచి పారిపోవాల్సిందే."

- రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే

'భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు పంపుతాం'

Raja Singh Controversy : భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సంచలనం సృష్టించారు. ఉత్తర్​ ప్రదేశ్​ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్​కు మద్దతివ్వని వారిని హెచ్చరించారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తర్వాత.. భాజపాకు ఓటు వేయని వారి జాబితా తీసి.. వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని హెచ్చరించారు. ఇందుకోసమే యోగి.. వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని వ్యాఖ్యానించారు.

యూపీలో ఉండాలంటే.. యోగిని గెలిపించాల్సిందే..

Raja Singh Controversy on UP Elections : ఉత్తర్​ప్రదేశ్​లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ అన్నారు. భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. భాజపా శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు. ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి.. యోగి సర్కార్​ రావాలని ఆకాంక్షించారు.

"ఉత్తర్​ ప్రదేశ్​లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలి. అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేసి మరోసారి గెలిపించాలి. కొందరు యోగి మళ్లీ సీఎం కాకూడదని కుట్రలు పన్నుతున్నారు. వాళ్లకి నేను చెప్పేదొకటే.. యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి రప్పించారు. మూడో దశ పోలింగ్​లో భాజపాకు ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం. వాళ్ల అందరికి ఇళ్లపైకి ఈ బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం. మీకు తెలుసుగా.. ఇవి ఏం చేస్తాయో. యూపీలో ఉండాలంటే.. జై యోగి ఆదిత్యనాథ్ అనాల్సిందే. భాజపాకు జై కొట్టాల్సిందే. లేకపోతే.. ఉత్తర్​ ప్రదేశ్​ నుంచి పారిపోవాల్సిందే."

- రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే

'భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు పంపుతాం'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.