హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళను జీహెచ్ఎంసీ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సౌందర్య అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హెల్మెట్ ధరించినా ప్రాణాలు దక్కలేదు.
స్థానికులు లారీ డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం