ETV Bharat / city

వాడీవేడిగా సాగిన జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం - revanth reddy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. తమ తమ ప్రాంతాల్లో ఉత్పన్నమౌతున్న శానిటేషన్ సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమవుతున్నారంటూ కార్పొరేటర్లు అధికారులపై మండిపడ్డారు. ఇంజినీరింగ్ పనుల్లో పూర్తిగా అలసత్వం ఉందని అధికారులపై మండిపడ్డారు. మూడున్నర ఏళ్లుగా అడిగిన ప్రశ్నలు మళ్ళి వస్తున్నాయంటే సమస్యల పరిష్కారం  ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు కార్పొరేటర్లు.

వాడీవేడిగా సాగిన జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం
author img

By

Published : Nov 3, 2019, 10:26 AM IST

జీహెచ్ఎంసీ 12వ జనరల్ బాడీ సమావేశం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్పొరేటర్లు కౌన్సిల్​ దృష్టికి తీసుకొచ్చి... అధికారుల పనితీరుపై మండి పడ్డారు. గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకు పెరిగిపోతోందని... ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోందని... అధికారుల స్పందన సక్రమంగా ఉండటం లేదని కార్పొరేటర్లు మండి పడ్డారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో రోడ్లు ఊడ్చడానికి సిబ్బంది కొరత ఉందని కౌన్సిల్​ దృష్టికి తీసుకొచ్చారు.

నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

చెత్త సేకరణకు కొత్త వాహనాలను ఏర్పాటు చేయడంతోపాటు నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్​ లోకేశ్​కుమార్​ తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్​ సమాధానమిచ్చారు. చెత్త ట్రాన్స్​ఫర్ కేంద్రాలను ఆధునీకరించి వాసన రాకుండా చూస్తామన్నారు. కొత్తగా నియమించే కార్మికుల విషయంపై మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టతనిచ్చారు. ప్రధాన రోడ్లలో త్వరలో మరిన్ని స్వీపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదు : మేయర్​

కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, రామచందర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు హాజరయ్యారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎంత చెల్లించింది.. ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత?...వాటిని చెల్లిస్తారా లేదా అనే అంశాలను తెలియజేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి తమకు వెసులు బాటు ఉన్నప్పుడు చెల్లించామని ఇప్పుడు డబ్బులు చెల్లించలేమని కౌన్సిల్ తీర్మానించిందని మేయర్ సమధానమిచ్చారు. తాము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు మేయర్.

సమస్యలు పరిష్కారం కావట్లేదు

బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.

వాడీవేడిగా సాగిన జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం

ఇవీ చూడండి: ట్రాఫిక్ చిక్కులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు

జీహెచ్ఎంసీ 12వ జనరల్ బాడీ సమావేశం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్పొరేటర్లు కౌన్సిల్​ దృష్టికి తీసుకొచ్చి... అధికారుల పనితీరుపై మండి పడ్డారు. గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకు పెరిగిపోతోందని... ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోందని... అధికారుల స్పందన సక్రమంగా ఉండటం లేదని కార్పొరేటర్లు మండి పడ్డారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో రోడ్లు ఊడ్చడానికి సిబ్బంది కొరత ఉందని కౌన్సిల్​ దృష్టికి తీసుకొచ్చారు.

నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

చెత్త సేకరణకు కొత్త వాహనాలను ఏర్పాటు చేయడంతోపాటు నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్​ లోకేశ్​కుమార్​ తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్​ సమాధానమిచ్చారు. చెత్త ట్రాన్స్​ఫర్ కేంద్రాలను ఆధునీకరించి వాసన రాకుండా చూస్తామన్నారు. కొత్తగా నియమించే కార్మికుల విషయంపై మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టతనిచ్చారు. ప్రధాన రోడ్లలో త్వరలో మరిన్ని స్వీపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదు : మేయర్​

కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, రామచందర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు హాజరయ్యారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎంత చెల్లించింది.. ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత?...వాటిని చెల్లిస్తారా లేదా అనే అంశాలను తెలియజేయాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి తమకు వెసులు బాటు ఉన్నప్పుడు చెల్లించామని ఇప్పుడు డబ్బులు చెల్లించలేమని కౌన్సిల్ తీర్మానించిందని మేయర్ సమధానమిచ్చారు. తాము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు మేయర్.

సమస్యలు పరిష్కారం కావట్లేదు

బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.

వాడీవేడిగా సాగిన జీహెచ్​ఎంసీ సర్వసభ్య సమావేశం

ఇవీ చూడండి: ట్రాఫిక్ చిక్కులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు

Tg_hyd_12_03_ghmc_council_meeting_overal_pkg_3182301 Reporter: Kartheek Note: feed 3g () గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. తమ తమ ప్రాంతాల్లో ఉత్పన్నమౌతున్న శానిటేషన్ సమస్యలను అధికారులు పరిష్కరిచడం లో విఫలం అవుతున్నారంటూ కార్పోరేటర్లు అధికారులపై మండిపడ్డారు. ఎల్ ఈ డి వెలుగుల్లో..., ఇంజనీరింగ్ పనుల్లో పూర్తిగా అలసత్వం ఉందని అధికారులపై మండిపడ్డారు ప్రజా ప్రతినిధులు. మూడున్నర ఏళ్లుగా అడిగిన ప్రశ్నలు మళ్ళి వస్తున్నాయంటే సమస్యల పరిష్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు కార్పొరేటర్లు. వాయిస్ ఓవర్: జీహెచ్ఎంసీ 12వ జనరల్ భాడి సమావేశం మేయర్ బోంతు రామ్మోహన్ అద్యక్షన జరిగింది. సిటిలో ప్రజలు ఎదుర్కోంటున్న పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు కార్పొరేటర్లు. ప్రధానంగా అధికారుల పనితీరుపై మండి పడ్డారు. కౌన్సిల్ నిర్ణయం చేసిన పనులు కూడా అదికారలు అమలు చేయ్యడంలో విఫలం అవుతున్నారని మండి పడ్డారు. గ్రేటర్ పరిదిలో శానిటేషన్ సమస్య రోజు రోజు కు పేరిగిపోతుందని..., ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతుందని అధికారుల స్పందన సక్రమంగా ఉండటం లేదని మండి పడ్డారు కార్పొరేటర్లు. సిటిలోని పలు ప్రాంతాల్లో ఎర్పాటు చేసిన ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నుండి వస్తున్న దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతే కాకుండా కోత్త ఎరియాలు పేరిగాయని కోత్త కాలనీలు వచ్చాయని అక్కడ రోడ్లు ఊడ్చడానికి అవసరం అయిన సిబ్బంది కోరత ఉందని కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. బైట్: శంకర్ యాదవ్ కార్పొరేటర్, భాజపా (బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి మొదట్లో మాట్లాడారు) బైట్: మాజీద్ హుస్సేన్ మాజీ మేయర్ వాయిస్ ఓవర్: అయితే చెత్త సేకరణకు కోత్త వాహనాలను ఎర్పాటు చేయ్యడంతోపాటు..., నిర్మాణ వ్యర్థాలను తోలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సభ దృష్టికి తేచ్చారు కమీషనర్ లోకేష్ కుమార్. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సూదీర్ఘసమాదనం ఇచ్చిన లోకేష్ కుమార్ చెత్త ట్రాన్స్ ఫర్ కేంద్రాలను మోడ్రనైజ్ చేయ్యడం ద్వారా వాసన రాకుండా చూస్తామన్నారు. దసరా సందర్భంగా వేహికిల్స్ ప్రాబ్లమ్ వల్ల కోన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనని వాటిని క్లియర్ చేస్తున్నామన్నారు. ఎక్కువ వాహనాలు ఎర్పాటు చేయ్యడం వల్ల ప్రస్తుతం ప్రతి రోజు 7వేల 200 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. ఇకకోత్తగా నియమించే కార్మికుల విషయం మాట్లాడిన మేయర్ బోంతు రామ్మోహన్ ప్రదాన రోడ్లలో త్వరలో మరిన్ని స్వీపింగ్ మిషన్లు ఎర్పాటు చేస్తామని అక్కడ ఉండే కార్మికులను ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తామన్నారు. వయస్సుపై బడ్డ కార్మికుల స్థానంలో వారికుటుంబ సభ్యులను నియమించేందుకు అధికారులు కార్పొరేటర్లు కలిసి పని చేయ్యాలని సూచించారు. బైట్ : లోకేష్ కుమార్ కమీషనర్ జిహెచ్ఎంసి బైట్: బోంతు రామ్మోహన్ మేయర్ జిహెచ్ఎంసి. వాయిస్: కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫియో సభ్యులు ఎంపి రేవంత్ రెడ్డి.., ఎమ్మెల్సీ లు ప్రభాకర్, జాప్రి, రామ చందర్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు హజరు అయ్యారు. ఆర్టిసికి జిహెచ్ఎంసి ఇప్పటి వరకు ఎంత చెల్లించింది..., ఇంకా చేల్లించాల్సిన బకాయిలు ఎంత..., వాటిని చెల్లిస్తారా లేదా అనే అంశాలను తెలియజేయ్యాలని ఎంపి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శివారు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తమకు చెందదని జోనల్ కమీషన్ చెప్పడంపై సభ దృష్టికి తెచ్చారు. ఇక మూసాపేట్ వద్ద ఉన్న రెండు స్లమ్ముల్లో ఉన్న పేదలకు టాయిట్స్ సౌకర్యం కల్పించడం తోపాటు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో అధికారులు ఎందుకు అడ్డుపడుతున్నారన్నారు ఎంపి. ఆర్టికి తమకు వెసులు బాటు ఉన్నప్పుడు చెల్లించామని ఇప్పుడు డబ్బులు చెల్లించలేమని కౌన్సిల్ తీర్మాణించిందని మేయర్ బోంతు రామ్మోహన్ సమాదానం ఇచ్చారు. తాము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకోచ్చారు మేయర్. బైట్: రేవంత్ రెడ్డి ఎంపి బైట్: బోంతు రామ్మోహన్ మేయర్ జిహెచ్ఎంసి. వాయిస్: ఇక సిటిలో ఎర్పాటు చేసిన ఎల్ ఈ డి లైట్లు నిర్వహణ అస్తవ్యస్థంగా ఉందంటూ కార్పొరేటర్లు విమర్శించారు. వాటి రిపేర్ల విషయంలో ప్రయివేటు కాంట్రాక్టర్లు తగిన శ్రద్ద చూపండం లేదంటూ మండి పడ్డారు కార్పొరేటర్లు. కోత్త లైట్లు కావాలంటే అసలు వేయ్యడం లేదని...., పాడైన బల్బులు రిప్లెస్ చేయ్యడానికి వారాల తరబడి టైం తీసుకుంటున్నారని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. అయితే 98శాతం లైట్లు వెలిగితేనే కాంట్రాక్టు ఎజేన్సీలకు బిల్లులు చెల్లించాలని..., నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆదేశించారు మేయర్ బోంతు రామ్మోహన్. బైట్: మహ్మద్ హుస్సేన్ ఎంఐఎం కార్పొరేటర్. (లైట్ల గురించి మొదట మాట్లాడిన వ్యక్తి) బైట్: బోంతు రామ్మోహన్ మేయర్ జిహెచ్ఎంసి. ఎండ్ వాయిస్: బల్దియా కౌన్సిల్ మీటింగ్ కార్పోరేటర్లు తమ తమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ అవేదన వ్యక్తం చేశారు మూడున్నర ఎళ్లు అవుతున్నా అవే ప్రశ్నలు వేయ్యాల్సి వస్తుందన్నారు పలువురు కార్పొరేటర్లు. అయితే క్షేత్రస్థాయి అదికారులు ఎక్కడికక్కడ కార్పోరేటర్లతో సమావేశం అయ్యి సమస్యల పరిష్కారనికి కృషి చేయ్యాలని మేయర్ అదేశాలు జారీ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.