ETV Bharat / city

కరెంట్​ కట్​ చేసినందుకు పాతబస్తీలో ఏఈపై యువకుల దాడి.. ఒకరు అరెస్ట్​.. - oldcity attack case

Four men attack electrical engineer of Tapachabutra range and video viral
Four men attack electrical engineer of Tapachabutra range and video viral
author img

By

Published : Apr 19, 2022, 6:33 PM IST

Updated : Apr 19, 2022, 9:29 PM IST

18:30 April 19

పాతబస్తీలో విద్యుత్‌శాఖ అధికారులపై యువకుల దాడి.. ఒకరు అరెస్ట్​..

పాతబస్తీలో విద్యుత్‌శాఖ అధికారులపై యువకుల దాడి

Attack on Assistant Engineer: హైదరాబాద్​లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్‌ శాఖ అసిస్టెంట్​ ఇంజినీర్‌పై యువకులు చేసిన హల్చల్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. కొందరు యువకులు ఏఈ ఆఫీసుకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇష్టమున్నట్టు దుర్భాషలాడారు. ఆవేశంతో సబ్​ ఇంజినీర్​పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగలేదు. ఓ యువకుడైతే ఏకంగా ఇంజినీర్​పైకి దూసుకొచ్చి.. టేబుల్​ ఎక్కి మరీ కాలితో ఛాతిలో తన్నాడు. పిడిగుద్దులతో సబ్ ఇంజినీర్​ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అసలు.. దాడికి దిగిన కుర్రాడెవరు..? గొడవకు కారణమేంటంటే..?

కార్వాన్ విద్యుత్ సహాయ ఇంజినీర్ విజయ్ కుమార్ ఈరోజు ఉదయం.. లైన్​మెన్​తో కలిసి విద్యుత్​ బకాయిలను వసూళ్లు చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో టపాఛబుత్ర పీఎస్​ పరిధిలోని వాల్మీకినగర్​లో ఓ ఇంటికి సంబంధించి పెండింగ్​ బిల్లును చూసి ఆవాక్కయ్యాడు. ఆ ఇంటికి సంబంధించి రెండేళ్లుగా కరెంటు బిల్లు కట్టట్లేదు. దాదాపు 15 వేల రూపాయలు పెండింగ్​ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న మహిళ దృష్టికి తీసుకెళ్లారు. కనెక్షన్ కూడా తొలగించారు. బిల్లు కట్టిన తర్వాతే విద్యుత్​ను పునరుద్ధరిస్తామని చెప్పి వచ్చేశారు.

కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన మహిళ కుమాడు విశాల్(22).. విద్యుత్ కనెక్షన్ తొలగించిన సంగతి తెలుసుకొని ఆవేశంతో తన స్నేహితులను తీసుకుని కార్వాన్​లోని విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విజయ్​కుమార్​తో వాగ్వాదానికి దిగాడు. అతని స్నేహితులతో కలిసి విజయ్​కుమార్​ను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. అక్కడ ఉన్న విద్యుత్ సిబ్బంది వారించినా ఏమాత్రం లెక్కచేయకుండా.. విశాల్ దాడికి దిగాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి తెగబడ్డాడు. పట్టరాని ఆవేశంతో ఉన్న విశాత్​.. టేబుల్​ ఎక్కి మరీ ఏఈ విజయ్​కుమార్​ ఛాతితో తన్నాడు. ఈక్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత విశాల్, అతని తల్లి, స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.

ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఏఈ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏఈపై దాడికి దిగిన విశాల్​ను అరెస్ట్​ చేసి.. విచారిస్తున్నారు. విజయ్​కుమార్​కు ఛాతిలో తన్నటంతో.. నొప్పిగా ఉండటంతో వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పాలుపంచుకున్న అందరిపైన కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టపాఛబుత్ర పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

18:30 April 19

పాతబస్తీలో విద్యుత్‌శాఖ అధికారులపై యువకుల దాడి.. ఒకరు అరెస్ట్​..

పాతబస్తీలో విద్యుత్‌శాఖ అధికారులపై యువకుల దాడి

Attack on Assistant Engineer: హైదరాబాద్​లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్‌ శాఖ అసిస్టెంట్​ ఇంజినీర్‌పై యువకులు చేసిన హల్చల్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. కొందరు యువకులు ఏఈ ఆఫీసుకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇష్టమున్నట్టు దుర్భాషలాడారు. ఆవేశంతో సబ్​ ఇంజినీర్​పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగలేదు. ఓ యువకుడైతే ఏకంగా ఇంజినీర్​పైకి దూసుకొచ్చి.. టేబుల్​ ఎక్కి మరీ కాలితో ఛాతిలో తన్నాడు. పిడిగుద్దులతో సబ్ ఇంజినీర్​ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అసలు.. దాడికి దిగిన కుర్రాడెవరు..? గొడవకు కారణమేంటంటే..?

కార్వాన్ విద్యుత్ సహాయ ఇంజినీర్ విజయ్ కుమార్ ఈరోజు ఉదయం.. లైన్​మెన్​తో కలిసి విద్యుత్​ బకాయిలను వసూళ్లు చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో టపాఛబుత్ర పీఎస్​ పరిధిలోని వాల్మీకినగర్​లో ఓ ఇంటికి సంబంధించి పెండింగ్​ బిల్లును చూసి ఆవాక్కయ్యాడు. ఆ ఇంటికి సంబంధించి రెండేళ్లుగా కరెంటు బిల్లు కట్టట్లేదు. దాదాపు 15 వేల రూపాయలు పెండింగ్​ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న మహిళ దృష్టికి తీసుకెళ్లారు. కనెక్షన్ కూడా తొలగించారు. బిల్లు కట్టిన తర్వాతే విద్యుత్​ను పునరుద్ధరిస్తామని చెప్పి వచ్చేశారు.

కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన మహిళ కుమాడు విశాల్(22).. విద్యుత్ కనెక్షన్ తొలగించిన సంగతి తెలుసుకొని ఆవేశంతో తన స్నేహితులను తీసుకుని కార్వాన్​లోని విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విజయ్​కుమార్​తో వాగ్వాదానికి దిగాడు. అతని స్నేహితులతో కలిసి విజయ్​కుమార్​ను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. అక్కడ ఉన్న విద్యుత్ సిబ్బంది వారించినా ఏమాత్రం లెక్కచేయకుండా.. విశాల్ దాడికి దిగాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి తెగబడ్డాడు. పట్టరాని ఆవేశంతో ఉన్న విశాత్​.. టేబుల్​ ఎక్కి మరీ ఏఈ విజయ్​కుమార్​ ఛాతితో తన్నాడు. ఈక్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత విశాల్, అతని తల్లి, స్నేహితులు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.

ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఏఈ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏఈపై దాడికి దిగిన విశాల్​ను అరెస్ట్​ చేసి.. విచారిస్తున్నారు. విజయ్​కుమార్​కు ఛాతిలో తన్నటంతో.. నొప్పిగా ఉండటంతో వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పాలుపంచుకున్న అందరిపైన కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టపాఛబుత్ర పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 19, 2022, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.