ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

EVT BHARAT TOP TEN 11AM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Nov 26, 2020, 10:57 AM IST

1. దేశవ్యాప్తంగా ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బంగాల్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి సీపీఐ(ఎంఎల్​), సీపీఎం, కాంగ్రెస్. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాదవ్​పుర్​లోని రైల్వే ట్రాక్​ను నిర్బంధించారు ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. స్తంభించిన రవాణా

దేశవ్యాప్త కార్మిక సంఘాల నిరసనకు రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ తరుణంలో ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తగా రవాణా సేవలను నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. దేశవ్యాప్తంగా 44,489 కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 44,489 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 92లక్షల 66వేల 706కు చేరింది. వైరస్​ కారణంగా మరో 524 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రాష్ట్రంలో 862 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,904 కరోనా కేసులు నమోదు కాగా 1,444 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. గౌరవం కాపాడాలి : బండి సంజయ్

పీవీ జయంతి ఉత్సవాలు జరపడం కాదు.. ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లైవ్ వీడియో: కమ్మేసిన మృత్యువు

మృత్యువు ఎప్పుడు ఆవహిస్తుందో తెలియదనడానికి ఇదొక నిదర్శనం. రోడ్డుపై ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా.. పక్కనే ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలి అతడిపై పడింది. నివర్​ తుపాను ప్రభావంతో భారీ వృక్షం ఒక్కసారిగా మీద పడటం వల్ల అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'బాల్యంలోనే ఎయిడ్స్​ ముప్పు'

ప్రపంచాన్ని ఓ వైపు కరోనా కలవరపెడుతుంటే.. మరోవైపు హెచ్​ఐవీ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఓ వ్యక్తికి హెచ్​ఐవీ​ సోకుతుందని యూనిసెఫ్​ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 20ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉన్నారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఫ్లాట్​గా దేశీయ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 43,890 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'వికెట్​ కీపింగ్ చేస్తా'

రాబోయే మూడు ఐసీసీ ప్రపంచకప్పుల్లో వికెట్​ కీపర్​గా బాధ్యతలు నిర్వర్తించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​ అన్నాడు. ఇదే కాకుండా జట్టు తన నుంచి ఏది ఆశించినా చేయడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రెమ్యునరేషన్​తో రెస్టారెంట్​

ఇటీవలే 'మిడిల్​క్లాస్​ మెలొడీస్​' చిత్రంతో హిట్​ అందుకున్న టాలీవుడ్​ యంగ్​ హీరో ఆనంద్​ దేవరకొండ.. వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్​లోని ఖాజాగూడలో 'గుడ్​ వైబ్స్​ ఓన్లీ కేఫ్​' రెస్టారెంట్​ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. దేశవ్యాప్తంగా ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బంగాల్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి సీపీఐ(ఎంఎల్​), సీపీఎం, కాంగ్రెస్. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జాదవ్​పుర్​లోని రైల్వే ట్రాక్​ను నిర్బంధించారు ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. స్తంభించిన రవాణా

దేశవ్యాప్త కార్మిక సంఘాల నిరసనకు రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ తరుణంలో ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తగా రవాణా సేవలను నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. దేశవ్యాప్తంగా 44,489 కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 44,489 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 92లక్షల 66వేల 706కు చేరింది. వైరస్​ కారణంగా మరో 524 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రాష్ట్రంలో 862 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,904 కరోనా కేసులు నమోదు కాగా 1,444 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. గౌరవం కాపాడాలి : బండి సంజయ్

పీవీ జయంతి ఉత్సవాలు జరపడం కాదు.. ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లైవ్ వీడియో: కమ్మేసిన మృత్యువు

మృత్యువు ఎప్పుడు ఆవహిస్తుందో తెలియదనడానికి ఇదొక నిదర్శనం. రోడ్డుపై ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా.. పక్కనే ఉన్న చెట్టు ఒక్కసారిగా కూలి అతడిపై పడింది. నివర్​ తుపాను ప్రభావంతో భారీ వృక్షం ఒక్కసారిగా మీద పడటం వల్ల అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'బాల్యంలోనే ఎయిడ్స్​ ముప్పు'

ప్రపంచాన్ని ఓ వైపు కరోనా కలవరపెడుతుంటే.. మరోవైపు హెచ్​ఐవీ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఓ వ్యక్తికి హెచ్​ఐవీ​ సోకుతుందని యూనిసెఫ్​ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 20ఏళ్లలోపు ఉన్నవారే అధికంగా ఉన్నారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఫ్లాట్​గా దేశీయ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 43,890 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'వికెట్​ కీపింగ్ చేస్తా'

రాబోయే మూడు ఐసీసీ ప్రపంచకప్పుల్లో వికెట్​ కీపర్​గా బాధ్యతలు నిర్వర్తించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​ అన్నాడు. ఇదే కాకుండా జట్టు తన నుంచి ఏది ఆశించినా చేయడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రెమ్యునరేషన్​తో రెస్టారెంట్​

ఇటీవలే 'మిడిల్​క్లాస్​ మెలొడీస్​' చిత్రంతో హిట్​ అందుకున్న టాలీవుడ్​ యంగ్​ హీరో ఆనంద్​ దేవరకొండ.. వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్​లోని ఖాజాగూడలో 'గుడ్​ వైబ్స్​ ఓన్లీ కేఫ్​' రెస్టారెంట్​ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.