1. దేశంలో 67 లక్షలు దాటిన కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. కొత్తగా 70,049 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మరో 986 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులోనే దాదాపు 12 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. అదే సమయంలో కరోనా రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రాష్ట్రంలో 2,154
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 2,154 కొవిడ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,04,748కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 1,189 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు'
నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన... త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'నన్నెవరూ పట్టించుకోవడం లేదు'
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆసుపత్రుల్లో కరోనాకు సరైన చికిత్స అందించండం లేదు... చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మళ్లీ 'పళనిస్వామి'కే ఓటు
వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'సిట్' నివేదిక ఆలస్యం
హాథ్రస్ ఘటనపై నియమించిన సిట్ నివేదిక ఆలస్యం కానుంది. దర్యాప్తు ఇంకా పూర్తికాని నేపథ్యంలో నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజులు సమయమిచ్చింది యోగి సర్కార్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. లాభాల బాటలోకి..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 39 వేల 881 వద్ద ఉంది. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11 వేల 740 వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ప్రశ్నించిన 40 దేశాలు
మైనారిటీ వర్గాలపై చైనా తీరును 40 పశ్చిమ దేశాలు తప్పుబట్టాయి. నూతన జాతీయ భద్రత చట్టం వల్ల హాంకాంగ్లోని మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'సూర్య బ్యాటింగ్ అద్భుతం'
జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉండటం వల్లే తమను విజయం వరిస్తోందని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మంగళవారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం పలు విషయాలు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఫిల్మ్సిటీలో రవితేజ 'క్రాక్'
రవితేజ 'క్రాక్' సినిమా షూటింగ్.. రామోజీ ఫిల్మ్సిటీలో బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.