ETV Bharat / city

టాప్​ 10 న్యూస్ @ 1PM

author img

By

Published : Jun 26, 2020, 12:56 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP 10 NEWS 1PM
టాప్​ 10 న్యూస్ @ 1PM

1. 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్' ప్రారంభించిన మోదీ

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన 'ఆత్మ నిర్భర్​ ఉత్తర్​ప్రదేశ్ రోజ్​గార్​ యోజన'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్థానికంగా ఎంట్రప్రెన్యూర్​షిప్​ను ప్రోత్సహించడం... వలసకూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

2. సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్‌, పోచారం

రాష్ట్రంలో ఆరోవిడత హరితహారం జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సభాపతి పోచారం, మంత్రి కేటీఆర్​ రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

3. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పర్యటించారు. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

5. రోడ్డుప్రమాదంలో దంపతులు, కుమారుడు దుర్మరణం

కారు, ట్యాంకర్​ను ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు, వారి కుమారుడు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

6. శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే

దిల్లీలో శనివారం నుంచి సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వే చేపట్టేందుకు అధికారులకు అవసరమైన శిక్షణ పూర్తయినట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

7. సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దు​కు సుప్రీం ఓకే

జులైలో జరగాల్సిన సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్రం చేసిన వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు నిర్ణయించేందుకు సీబీఎస్​ఈకి అనుమతిచ్చింది. పరీక్షల రద్దుకు నోటిఫికేషన్​ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

8. వికెట్ పడిన ప్రతిసారీ ఎగిరి గంతులేశాం

1983లో దిగ్గజ వెస్టిండీస్​తో తలపడి.. భారత క్రికెట్​ జట్టు సాధించిన ప్రపంచ కప్​కు గురువారం నాటికి 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా సచిన్​ తెందుల్కర్​ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ.. సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

9. 104 రోజుల తర్వాత కిటకిటలాడిన ఈఫిల్​ టవర్​

ఫ్రాన్స్​లోని ఈఫిల్​ టవర్​ను 104రోజుల అనంతరం సందర్శనకు అనుమతినిచ్చారు. కరోనా సంక్షోభం దృష్ట్యా మూతపడ్డ ఈఫిల్​ టవర్​.. ఇప్పుడు పర్యటకులతో కిటకిటలాడుతోంది. అయితే భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

10. 'ఆమెను సుశాంత్​ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు'

వచ్చే ఏడాది ప్రారంభంలో సుశాంత్ పెళ్లిచేసుకోవాలనుకున్నాడని అతడి తండ్రి కేకే సింగ్ చెప్పారు. తమతో అతడు జరిపిన చివరి సంభాషణ ఇదేనని గుర్తు చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

1. 'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్' ప్రారంభించిన మోదీ

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన 'ఆత్మ నిర్భర్​ ఉత్తర్​ప్రదేశ్ రోజ్​గార్​ యోజన'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్థానికంగా ఎంట్రప్రెన్యూర్​షిప్​ను ప్రోత్సహించడం... వలసకూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

2. సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్‌, పోచారం

రాష్ట్రంలో ఆరోవిడత హరితహారం జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సభాపతి పోచారం, మంత్రి కేటీఆర్​ రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

3. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పర్యటించారు. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

5. రోడ్డుప్రమాదంలో దంపతులు, కుమారుడు దుర్మరణం

కారు, ట్యాంకర్​ను ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు, వారి కుమారుడు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

6. శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే

దిల్లీలో శనివారం నుంచి సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సర్వే చేపట్టేందుకు అధికారులకు అవసరమైన శిక్షణ పూర్తయినట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

7. సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దు​కు సుప్రీం ఓకే

జులైలో జరగాల్సిన సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్రం చేసిన వినతికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. గత పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు నిర్ణయించేందుకు సీబీఎస్​ఈకి అనుమతిచ్చింది. పరీక్షల రద్దుకు నోటిఫికేషన్​ జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

8. వికెట్ పడిన ప్రతిసారీ ఎగిరి గంతులేశాం

1983లో దిగ్గజ వెస్టిండీస్​తో తలపడి.. భారత క్రికెట్​ జట్టు సాధించిన ప్రపంచ కప్​కు గురువారం నాటికి 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా సచిన్​ తెందుల్కర్​ ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ.. సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

9. 104 రోజుల తర్వాత కిటకిటలాడిన ఈఫిల్​ టవర్​

ఫ్రాన్స్​లోని ఈఫిల్​ టవర్​ను 104రోజుల అనంతరం సందర్శనకు అనుమతినిచ్చారు. కరోనా సంక్షోభం దృష్ట్యా మూతపడ్డ ఈఫిల్​ టవర్​.. ఇప్పుడు పర్యటకులతో కిటకిటలాడుతోంది. అయితే భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

10. 'ఆమెను సుశాంత్​ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు'

వచ్చే ఏడాది ప్రారంభంలో సుశాంత్ పెళ్లిచేసుకోవాలనుకున్నాడని అతడి తండ్రి కేకే సింగ్ చెప్పారు. తమతో అతడు జరిపిన చివరి సంభాషణ ఇదేనని గుర్తు చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.