ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ ​@ 11AM

author img

By

Published : Jul 19, 2021, 10:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​@11AM
టాప్​ టెన్​ న్యూస్​@11AM

కీలక భేటీ

కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్..ఇంజినీర్లు, న్యాయవాదులు, ఈఎన్‌సీలు, అడ్వొకేట్ జనరల్​తో భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తెతెదేపా కొత్త సారథి

తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకమయ్యారు. తెతెదేపా అధ్యక్షుడిగా నర్సింహులును తెదేపా జాతీయాధ్యక్షులు చంద్రబాబు నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈటల యాత్ర షురూ

కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా జీవన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇలాగైతే మూడోముప్పే!

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు, జాతరలు, సమావేశాల వల్ల జనమంతా ఒక్కచోటకు చేరితే... కొవిడ్ మహమ్మారి విజృంభించే అవకాశాలున్నాయని వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలంతా ఎక్కడికెళ్లినా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని లేనిపక్షంలో కరోనా కాటు తప్పదని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్తగా 38వేల కేసులు

భారత్​లో కరోనా కేసులు(Covid 19 india) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,164 మందికి వైరస్​ సోకింది. మరో 499 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 38,660 మంది వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోర ప్రమాదం

ఆగి ఉన్న బస్సును మరో బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా కుటుంబం

కొవిడ్ మహమ్మారి లాగానే.. జంతువుల నుంచి మరెన్నో వైరస్‌లు మానవులకు సోకుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జంతువుల ద్వారా సోకే దాదాపు 10 రకాల వైరస్‌లు మానవాళికి మహమ్మారులుగా పరిణమించవచ్చని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. నిపా, జికా వైరస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పాక్​ మరో కుట్ర

అఫ్గానిస్థాన్​లో భారత్‌ ఆస్తులను.. ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్​ గూఢచర్య ఐఎస్ఐ మరో కుట్రకు తెరతీసింది. తాలిబన్లకు మద్దతుగా 10,000 మంది సాయుధులను అఫ్గాన్​లోకి పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బంగ్లా గెలుపు

జింబాబ్వేతో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ అతికష్టం మీద గెలిచింది. మరోవైపు పాకిస్థాన్​పై రెండో టీ20లో గెలిచిన ఇంగ్లాండ్​, తొలి మ్యాచ్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

క్రేజీ రియాక్షన్!

తాను చనిపోయానంటూ​ వచ్చిన ఓ వీడియో గురించి స్పందించాడు నటుడు సిద్ధార్థ్​(Actor Siddharth). దీనిపై యూట్యూబ్​కు ఫిర్యాదు చేసినప్పటికీ, వాళ్లు ఇచ్చిన సమాధానం ఇతడిని ఆశ్చర్యపరిచింది! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కీలక భేటీ

కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్..ఇంజినీర్లు, న్యాయవాదులు, ఈఎన్‌సీలు, అడ్వొకేట్ జనరల్​తో భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తెతెదేపా కొత్త సారథి

తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకమయ్యారు. తెతెదేపా అధ్యక్షుడిగా నర్సింహులును తెదేపా జాతీయాధ్యక్షులు చంద్రబాబు నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈటల యాత్ర షురూ

కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజా జీవన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇలాగైతే మూడోముప్పే!

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు, జాతరలు, సమావేశాల వల్ల జనమంతా ఒక్కచోటకు చేరితే... కొవిడ్ మహమ్మారి విజృంభించే అవకాశాలున్నాయని వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలంతా ఎక్కడికెళ్లినా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని లేనిపక్షంలో కరోనా కాటు తప్పదని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్తగా 38వేల కేసులు

భారత్​లో కరోనా కేసులు(Covid 19 india) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,164 మందికి వైరస్​ సోకింది. మరో 499 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 38,660 మంది వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోర ప్రమాదం

ఆగి ఉన్న బస్సును మరో బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా కుటుంబం

కొవిడ్ మహమ్మారి లాగానే.. జంతువుల నుంచి మరెన్నో వైరస్‌లు మానవులకు సోకుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జంతువుల ద్వారా సోకే దాదాపు 10 రకాల వైరస్‌లు మానవాళికి మహమ్మారులుగా పరిణమించవచ్చని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. నిపా, జికా వైరస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పాక్​ మరో కుట్ర

అఫ్గానిస్థాన్​లో భారత్‌ ఆస్తులను.. ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్​ గూఢచర్య ఐఎస్ఐ మరో కుట్రకు తెరతీసింది. తాలిబన్లకు మద్దతుగా 10,000 మంది సాయుధులను అఫ్గాన్​లోకి పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బంగ్లా గెలుపు

జింబాబ్వేతో మ్యాచ్​లో బంగ్లాదేశ్​ అతికష్టం మీద గెలిచింది. మరోవైపు పాకిస్థాన్​పై రెండో టీ20లో గెలిచిన ఇంగ్లాండ్​, తొలి మ్యాచ్​ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

క్రేజీ రియాక్షన్!

తాను చనిపోయానంటూ​ వచ్చిన ఓ వీడియో గురించి స్పందించాడు నటుడు సిద్ధార్థ్​(Actor Siddharth). దీనిపై యూట్యూబ్​కు ఫిర్యాదు చేసినప్పటికీ, వాళ్లు ఇచ్చిన సమాధానం ఇతడిని ఆశ్చర్యపరిచింది! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.