ETV Bharat / city

ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ షురూ..

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఒకరోజు ఆలస్యమైన వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ పలు కారణాల వల్ల జాప్యమైనట్టు అధికారులు తెలిపారు. ఈసారి వెబ్​ ఆప్షన్లలో కొత్త కోర్సులు ఉండనున్నట్టు అధికారులు ప్రకటించారు.

author img

By

Published : Oct 19, 2020, 9:42 PM IST

Engineering Web Options Process Starts In Telangana
ప్రారంభమైన ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ.. ఈ ఏడాది కొత్త కోర్సులు

ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకరోజు ఆలస్యంగా.. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కొత్త కోర్సులకు అనుమతి, అనుబంధ గుర్తింపు ప్రక్రియలో జాప్యం కారణంగా.. ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వెబ్​ ఆప్షన్ల కోసం విద్యార్థులు రెండు రోజులుగా ఎదురు చూశారు.

ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్షా 32 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు సమర్పించారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబర్​ 22 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉన్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటితో ముగియనుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్​లో 45 కోర్సుల్లో 69,116 సీట్లతో పాటు.. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3352, ఫార్మా-డిలో 530 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్​లో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఐఓటీ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటుకి వచ్చాయి.

ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకరోజు ఆలస్యంగా.. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఇంజినీరింగ్​ వెబ్​ ఆప్షన్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కొత్త కోర్సులకు అనుమతి, అనుబంధ గుర్తింపు ప్రక్రియలో జాప్యం కారణంగా.. ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వెబ్​ ఆప్షన్ల కోసం విద్యార్థులు రెండు రోజులుగా ఎదురు చూశారు.

ప్రారంభించిన కొన్ని గంటల్లోనే లక్షా 32 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు సమర్పించారని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. అక్టోబర్​ 22 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉన్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ధ్రువపత్రాల పరిశీలన రేపటితో ముగియనుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్​లో 45 కోర్సుల్లో 69,116 సీట్లతో పాటు.. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3352, ఫార్మా-డిలో 530 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది కంప్యూటర్ సైన్స్​లో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఐఓటీ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటుకి వచ్చాయి.

ఇదీ చదవండిః శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.