ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటిన దసరా సంబురాలు..

Dussehra festival celebrations in telangana: రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఊరు వాడల్లో దసరా సందడి వాతావరణం నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రి ఉత్సవాలు చివరి రోజున రావణ, మైహిషాసుర దహన కార్యక్రమాలు నిర్వహించారు.

author img

By

Published : Oct 6, 2022, 6:43 AM IST

Updated : Oct 6, 2022, 10:39 AM IST

Dussehra festival celebrations
దసరా సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన దసరా వేడుకలు

Dussehra festival celebrations in telangana: రాష్ట్రవ్యాప్తంగా దసరా సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు వేడుకలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలక్ష్మణ ఆయుధాలకు పూజలు చేసి రావణాసురుని దహన కార్యక్రమం నిర్వహించారు.

సిద్దిపేటలోని దసరా ఉత్సవాల్లో మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో వాహన పూజలు చేశారు. అనంతరం నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత శోభయాత్ర చేపట్టారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మిని స్టేడియంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హాజరయ్యారు.

సంగారెడ్డి జిల్లా జహిరాబాద్‌లోని కైలాసగిరి శివాలయం వద్ద రావణ సంహార వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో యువతీ యువకులు అలరించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ లో నిర్వహించిన దసరా వేడుకల్లో జెడ్​పీ ఉపాధ్యాక్షుడు కొనేరు కృష్ణారావు, జిల్లా ఎస్​పీ సురేష్‌ కుమార్‌ దంపతులు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయంలో పోలీస్ సిబ్బంది ఆయుధ పూజలు నిర్వహించారు. జగిత్యాలలో జంబిగద్దె వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనంతరం మహిషాసుర దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన దసరా వేడుకలు

Dussehra festival celebrations in telangana: రాష్ట్రవ్యాప్తంగా దసరా సంబురాలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు వేడుకలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలక్ష్మణ ఆయుధాలకు పూజలు చేసి రావణాసురుని దహన కార్యక్రమం నిర్వహించారు.

సిద్దిపేటలోని దసరా ఉత్సవాల్లో మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో వాహన పూజలు చేశారు. అనంతరం నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత శోభయాత్ర చేపట్టారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మిని స్టేడియంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హాజరయ్యారు.

సంగారెడ్డి జిల్లా జహిరాబాద్‌లోని కైలాసగిరి శివాలయం వద్ద రావణ సంహార వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో యువతీ యువకులు అలరించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ లో నిర్వహించిన దసరా వేడుకల్లో జెడ్​పీ ఉపాధ్యాక్షుడు కొనేరు కృష్ణారావు, జిల్లా ఎస్​పీ సురేష్‌ కుమార్‌ దంపతులు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయంలో పోలీస్ సిబ్బంది ఆయుధ పూజలు నిర్వహించారు. జగిత్యాలలో జంబిగద్దె వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనంతరం మహిషాసుర దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.