హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీ ప్రజలను డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. మహారాష్ట్ర బ్యాంక్ రోడ్డు నుంచి రోడ్డు నెంబర్ 1 వచ్చే దారిలో మురుగు నీరు రహదారులపైకి ప్రవహిస్తోంది. చిన్న చినుకు పడినా.. ఆ ప్రాంతమంతా మురుగు కంపు కొడుతోంది.
ఇప్పటికే కరోనాతో భయాందోళనలో ఉన్న స్థానిక వాసులు.. మురుగు నీటి వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు