ETV Bharat / city

లాక్​డౌన్​పై త్వరలో రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలు: సీఎస్​

author img

By

Published : Apr 15, 2020, 8:06 PM IST

లాక్​డౌన్​పై రాష్ట్ర ప్రభుత్వం వేరుగా మార్గదర్శకాలు జారీచేస్తుందని సీఎస్​ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్షకు డీజీపీ, ఇతర అధికారులతో కలిపి సీఎస్​ హాజరయ్యారు.

cs video conference with central cabinet secretary
లాక్​డౌన్​పై త్వరలో రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలు: సీఎస్​

లాక్​డౌన్​కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు జారీచేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి సీఎస్​ సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్​డౌన్ అమలు, కంటైన్మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యలను సీఎస్​ వివరించారు. ఈనెల 20 అనంతరం ఇచ్చిన మినహాయింపులను కూడా కేంద్ర కేబినెట్ కార్యదర్శి వివరించారు.

లాక్​డౌన్​కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు జారీచేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి సీఎస్​ సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్​డౌన్ అమలు, కంటైన్మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యలను సీఎస్​ వివరించారు. ఈనెల 20 అనంతరం ఇచ్చిన మినహాయింపులను కూడా కేంద్ర కేబినెట్ కార్యదర్శి వివరించారు.

ఇవీచూడండి: 'దేశంలో మొత్తం 170 హాట్​స్పాట్​ ప్రాంతాలు గుర్తింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.