ETV Bharat / city

అక్టోబర్ పదో నాటికి రైతువేదికలన్నింటినీ పూర్తి చేయాలి: సీఎస్​

author img

By

Published : Jul 15, 2020, 6:05 PM IST

రైతువేదికల నిర్మాణ పనులన్నింటినీ ఈ నెల 18వ తేదీలోగా ప్రారంభించి అక్టోబర్ పదో తేదీ నాటికి అన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన సీఎస్... పట్టణప్రగతి, రైతువేదికల నిర్మాణం, విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు.

అక్టోబర్ పదో నాటికి రైతువేదికలన్నింటినీ పూర్తి చేయాలి: సీఎస్​
అక్టోబర్ పదో నాటికి రైతువేదికలన్నింటినీ పూర్తి చేయాలి: సీఎస్​

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, రైతు వేదిక నిర్మాణాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా నిర్వహించారు. రైతు వేదిక‌ల‌కు సంబంధించి మిగిలిన అన్ని అనుమ‌తులు ఈ నెల 18 వ‌ర‌కు వ‌స్తాయ‌ని అనంత‌రం ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో వేగవంతం చేయాల‌న్నారు. రైతు వేదిక నిర్మాణాల‌ను ప‌రిశీలించేందుకు సీనియ‌ర్ అధికారుల‌ను నియ‌మించాల‌న్నారు. అన్ని రైతు వేదిక నిర్మాణాలను 2020 అక్టోబర్ 10వ‌ లోగా పూర్తి చేయాలన్నారు. రైతు బంధు స‌మ‌స్య‌లు, క‌ల్లాల నిర్మాణం, గోడౌన్ల నిర్మాణం, ప్ర‌త్యేక ఆహార ప్రాసెసింగ్ జోన్ల‌కు సంబంధించిన అంశాల‌పై సైతం సీఎస్ భేటీలో స‌మీక్షించారు.

కొత్తగా విలీనం అయిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపాలిటీల చట్టం ప్రాముఖ్యతనిస్తుందన్నారు. విలీన గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ను క‌లెక్ట‌ర్లు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. అదేవిధంగా పారిశుధ్యం, క్రిమిసంహారక మందులను చల్లడం, లార్వా నివార‌ణ చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుస‌రించి పనిచేయాలని కలెక్టర్లను కోరారు.

స‌మావేశంలో పుర‌పాల‌క‌శాఖ‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అరవింద్ కుమార్, వ్య‌వ‌సాయ‌శాఖ కార్య‌ద‌ర్శి జనార్దన్ రెడ్డి, పీఆర్ అండ్ ఆర్డీ సెక్ర‌ట‌రీ సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్, పుర‌పాల‌క‌శాఖ డైర‌క్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, రైతు వేదిక నిర్మాణాల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా నిర్వహించారు. రైతు వేదిక‌ల‌కు సంబంధించి మిగిలిన అన్ని అనుమ‌తులు ఈ నెల 18 వ‌ర‌కు వ‌స్తాయ‌ని అనంత‌రం ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో వేగవంతం చేయాల‌న్నారు. రైతు వేదిక నిర్మాణాల‌ను ప‌రిశీలించేందుకు సీనియ‌ర్ అధికారుల‌ను నియ‌మించాల‌న్నారు. అన్ని రైతు వేదిక నిర్మాణాలను 2020 అక్టోబర్ 10వ‌ లోగా పూర్తి చేయాలన్నారు. రైతు బంధు స‌మ‌స్య‌లు, క‌ల్లాల నిర్మాణం, గోడౌన్ల నిర్మాణం, ప్ర‌త్యేక ఆహార ప్రాసెసింగ్ జోన్ల‌కు సంబంధించిన అంశాల‌పై సైతం సీఎస్ భేటీలో స‌మీక్షించారు.

కొత్తగా విలీనం అయిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపాలిటీల చట్టం ప్రాముఖ్యతనిస్తుందన్నారు. విలీన గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ను క‌లెక్ట‌ర్లు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాల‌న్నారు. అదేవిధంగా పారిశుధ్యం, క్రిమిసంహారక మందులను చల్లడం, లార్వా నివార‌ణ చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుస‌రించి పనిచేయాలని కలెక్టర్లను కోరారు.

స‌మావేశంలో పుర‌పాల‌క‌శాఖ‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అరవింద్ కుమార్, వ్య‌వ‌సాయ‌శాఖ కార్య‌ద‌ర్శి జనార్దన్ రెడ్డి, పీఆర్ అండ్ ఆర్డీ సెక్ర‌ట‌రీ సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్, పుర‌పాల‌క‌శాఖ డైర‌క్ట‌ర్‌, క‌మిష‌న‌ర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.