హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీ చేస్తున్నామన్నారు. సిటీ పరిధిలో 1340 సమస్యాత్మకమైన కేంద్రాలు గుర్తించామని వెల్లడించారు. హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోడల్ అధికారులను నియమించామని, దాదాపు 9వేల మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇవీ చూడండి:"ఎదిరించేవాడు లేకపోతే... బెదిరించే వాడిదే రాజ్యం"