ETV Bharat / city

రాష్ట్రంలో 21 నుంచి 40 ఏళ్ల వారిలోనే కరోనా లక్షణాలు అధికం

author img

By

Published : Aug 11, 2020, 10:19 PM IST

రాష్ట్రంలో మరో 1,896 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోలిస్తే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగింది. మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 645 మంది మరణించారు.

telangana corona cases
రాష్ట్రంలో 21 నుంచి 40 ఏళ్ల వారిలోనే కరోనా లక్షణాలు అధికం

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 వరకు 18వేల 35 నమునాలను పరీక్షించారు. 1896 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 82వేల 647కి చేరింది. వైరస్‌ ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోగా... మృతుల సంఖ్య 645కు చేరింది. వైరస్‌ నుంచి కోలుకుని 17వందల 88 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 59వేల 374 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.

ఇప్పటికి 6,42,875 కరోనా నిర్ధారణ పరీక్షలు..

రాష్ట్రంలో ప్రస్తుతం 22వేల 628 యాక్టివ్‌ కేసులున్నాయి. 15 వేల 554 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6లక్షల 42వేల 875 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 959 నమునాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

జిల్లాల్లో కేసుల పరిస్థితి..

హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో 338 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో-147, కరీంనగర్‌లో-121, మేడ్చల్‌లో-119 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వరంగల్‌ అర్బన్​ జిల్లాలో-95, జోగులాంబ గద్వాలలో-85, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో 71 చొప్పున కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లిలో-66, ఖమ్మం -65, సిద్దిపేట- 64, భద్రాద్రి కొత్తగూడెంలో 60 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

జగిత్యాలలో-59, మహబూబ్‌నగర్‌లో-58, నల్గొండలో-54, సంగారెడ్డిలో-49, నిజామాబాద్‌లో -42 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. రాజన్న సిరిసిల్లలో-38, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో -35, సూర్యాపేటలో-32, వనపర్తిలో-28, యాదాద్రి భువనగిరిలో- 24, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలో 23 చొప్పున కేసులు వెలుగుచూశాయి. వికారాబాద్‌లో -21, జయశంకర్‌ భూపాలపల్లిలో- 20, కుమురం భీం అసిఫాబాద్‌లో- 17, ఆదిలాబాద్‌ -14, మెదక్‌లో- 14 మంది వైరస్‌ బారినపడ్డారు. నారాయణపేటలో-13, నిర్మల్‌లో -12, మంచిర్యాలలో -11, నాగర్‌కర్నూల్‌లో-7 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వీరిలోనే అధికం..

దేశంలో కరోనా రికవరీ రేటు 69.33 శాతం ఉండగా...రాష్ట్రంలో 71.84 ఉందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కేసుల తీవ్రత 2.0 శాతం ఉండగా... రాష్ట్రంలో 0.78 శాతంగా ఉందని పేర్కొంది. 21 నుంచి 40 ఏళ్ల వయస్సున్న వారిలోనే వైరస్​ సోకుతుందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. నిబంధనలు పాటిస్తే... కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలమని పేర్కొంది.

ఇవీచూడండి: ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మరణాలు

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 వరకు 18వేల 35 నమునాలను పరీక్షించారు. 1896 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 82వేల 647కి చేరింది. వైరస్‌ ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోగా... మృతుల సంఖ్య 645కు చేరింది. వైరస్‌ నుంచి కోలుకుని 17వందల 88 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 59వేల 374 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.

ఇప్పటికి 6,42,875 కరోనా నిర్ధారణ పరీక్షలు..

రాష్ట్రంలో ప్రస్తుతం 22వేల 628 యాక్టివ్‌ కేసులున్నాయి. 15 వేల 554 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6లక్షల 42వేల 875 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 959 నమునాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

జిల్లాల్లో కేసుల పరిస్థితి..

హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో 338 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో-147, కరీంనగర్‌లో-121, మేడ్చల్‌లో-119 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వరంగల్‌ అర్బన్​ జిల్లాలో-95, జోగులాంబ గద్వాలలో-85, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో 71 చొప్పున కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లిలో-66, ఖమ్మం -65, సిద్దిపేట- 64, భద్రాద్రి కొత్తగూడెంలో 60 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

జగిత్యాలలో-59, మహబూబ్‌నగర్‌లో-58, నల్గొండలో-54, సంగారెడ్డిలో-49, నిజామాబాద్‌లో -42 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. రాజన్న సిరిసిల్లలో-38, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో -35, సూర్యాపేటలో-32, వనపర్తిలో-28, యాదాద్రి భువనగిరిలో- 24, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలో 23 చొప్పున కేసులు వెలుగుచూశాయి. వికారాబాద్‌లో -21, జయశంకర్‌ భూపాలపల్లిలో- 20, కుమురం భీం అసిఫాబాద్‌లో- 17, ఆదిలాబాద్‌ -14, మెదక్‌లో- 14 మంది వైరస్‌ బారినపడ్డారు. నారాయణపేటలో-13, నిర్మల్‌లో -12, మంచిర్యాలలో -11, నాగర్‌కర్నూల్‌లో-7 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వీరిలోనే అధికం..

దేశంలో కరోనా రికవరీ రేటు 69.33 శాతం ఉండగా...రాష్ట్రంలో 71.84 ఉందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కేసుల తీవ్రత 2.0 శాతం ఉండగా... రాష్ట్రంలో 0.78 శాతంగా ఉందని పేర్కొంది. 21 నుంచి 40 ఏళ్ల వయస్సున్న వారిలోనే వైరస్​ సోకుతుందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. నిబంధనలు పాటిస్తే... కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలమని పేర్కొంది.

ఇవీచూడండి: ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.