ETV Bharat / city

'సికింద్రాబాద్​' బాధితులకు అండగా కాంగ్రెస్​

author img

By

Published : Jun 24, 2022, 5:09 AM IST

అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఇటీవల చోటు చేసుకున్న సికింద్రబాద్​ రైల్వే ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. ఇందులో భాగంగా జైల్లో ఉన్న బాధితులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి శుక్రవారం కలవనున్నారు. వారి పక్షాన న్యాయపోరాటం చేస్తామని భరోసా కల్పించనున్నారు.

Secunderabad riots case
రేవంత్​ రెడ్డీ

అగ్నిపథ్‌ను వ్యతిరేఖిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలకు దిగి విధ్వంసం సృష్టించి... అరెస్టు అయ్యిన యువకులను ఇవాళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. ఇతర కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించనున్నారు. చంచలగూడ జైలులో ఉన్న ఈ యువకులను.. కాంగ్రెస్ నాయకులు కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు.. దరఖాస్తు చేయగా ఇద్దరికి మాత్రమే నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరొకరికి మాత్రమే ములాఖత్‌ అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు జైలు అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు 2 విడతల్లో 55 మంది యువకులను జుడీషియల్‌ రిమాండ్‌ తరలించారు. వారిలో ఇప్పటి వరకు 46 మందికి ములాఖత్‌ ఇచ్చారు. ఇంకా మరో 9 మందికి మాత్రమే ములాఖత్‌ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులకు కూడా.. ఈ 9 మందిలోనే ములాఖత్‌ కల్పించే అవకాశం ఉందని జైలు వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితులను కాంగ్రెస్‌ నాయకులకు కల్పించే అవకాశం లేదని తెలుస్తోంది. సికింద్రబాద్​ ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారుల తరఫున న్యాయపోరాటం చేయనుంది. కేసులో ఉన్నవారంతా విద్యార్థులు అయినందున వారి భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి న్యాయ సహాయం అందించటం కోసం గాంధీభవన్​లో 9919931993 టోల్​ఫ్రీ నంబర్​ ఏర్పాటు చేశారు.

27న నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలు.. అగ్నిపథ్​కు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేయనున్నారు నేతలు. నర్సంపేట నియోజకవర్గంలో సికింద్రబాద్​ కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్​ కుటుంబాన్ని రేవంత్​రెడ్డి పరామర్శించి, ఆందోళనలో పాల్గొననున్నారు.

అగ్నిపథ్‌ను వ్యతిరేఖిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలకు దిగి విధ్వంసం సృష్టించి... అరెస్టు అయ్యిన యువకులను ఇవాళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. ఇతర కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించనున్నారు. చంచలగూడ జైలులో ఉన్న ఈ యువకులను.. కాంగ్రెస్ నాయకులు కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి చంచలగూడ జైలు సూపరింటెండెంట్‌కు.. దరఖాస్తు చేయగా ఇద్దరికి మాత్రమే నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరొకరికి మాత్రమే ములాఖత్‌ అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు జైలు అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు 2 విడతల్లో 55 మంది యువకులను జుడీషియల్‌ రిమాండ్‌ తరలించారు. వారిలో ఇప్పటి వరకు 46 మందికి ములాఖత్‌ ఇచ్చారు. ఇంకా మరో 9 మందికి మాత్రమే ములాఖత్‌ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులకు కూడా.. ఈ 9 మందిలోనే ములాఖత్‌ కల్పించే అవకాశం ఉందని జైలు వర్గాలు తెలిపాయి. ప్రధాన నిందితులను కాంగ్రెస్‌ నాయకులకు కల్పించే అవకాశం లేదని తెలుస్తోంది. సికింద్రబాద్​ ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారుల తరఫున న్యాయపోరాటం చేయనుంది. కేసులో ఉన్నవారంతా విద్యార్థులు అయినందున వారి భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి న్యాయ సహాయం అందించటం కోసం గాంధీభవన్​లో 9919931993 టోల్​ఫ్రీ నంబర్​ ఏర్పాటు చేశారు.

27న నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలు.. అగ్నిపథ్​కు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేయనున్నారు నేతలు. నర్సంపేట నియోజకవర్గంలో సికింద్రబాద్​ కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్​ కుటుంబాన్ని రేవంత్​రెడ్డి పరామర్శించి, ఆందోళనలో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. షెడ్యూల్ ఇలా..!!

Petrol attack on brothers: ఖమ్మంలో దారుణం.. సోదరులపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన అన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.