ETV Bharat / city

'భాజపా, తెరాస చేస్తున్న విషప్రచారాలు నమ్మకండి'

author img

By

Published : Nov 26, 2020, 9:22 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బల్దియా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి... కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు. భాజపా, తెరాస చేస్తున్న విషప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

congress leader revanth reddy campaign in champapet
congress leader revanth reddy campaign in champapet

హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వం చేసిందేమిలేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్​రెడ్డి... చంపాపేట్‌, లింబోజుగూడ డివిజన్‌లలో పర్యటించారు.

అబద్ధపు ప్రచారానికి తెరాస బ్రాండ్​ అంబాసిడర్​గా మారిందని రేవంత్​ ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టటమే కాకుండా... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్​రెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో లింగోజుగూడ కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్‌ రెడ్డి, చంపాపేట అభ్యర్థితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

'భాజపా, తెరాస చేస్తున్న విషప్రచారాలు నమ్మకండి'

ఇదీ చూడండి: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం

హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వం చేసిందేమిలేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్​రెడ్డి... చంపాపేట్‌, లింబోజుగూడ డివిజన్‌లలో పర్యటించారు.

అబద్ధపు ప్రచారానికి తెరాస బ్రాండ్​ అంబాసిడర్​గా మారిందని రేవంత్​ ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టటమే కాకుండా... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్​రెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో లింగోజుగూడ కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్‌ రెడ్డి, చంపాపేట అభ్యర్థితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

'భాజపా, తెరాస చేస్తున్న విషప్రచారాలు నమ్మకండి'

ఇదీ చూడండి: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీతక్క ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.