ETV Bharat / city

నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల - municipal elections telangana Congress_Candidates_to be Finalized_Today

పురపాలక ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా ఇవాళ సిద్ధం కానుంది. అన్ని పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో ఇంఛార్జుల అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అధికార పార్టీకి దీటుగా నిలబడే అభ్యర్థులను 'సెలక్ట్‌- ఎలక్ట్‌' పద్ధతిన ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

Congress_Candidates_to be Finalized_Today
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
author img

By

Published : Jan 9, 2020, 5:53 AM IST

Updated : Jan 9, 2020, 8:11 AM IST

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 120 పురపాలక, 9 నగరపాలక సంస్థల పరిధిలో 2,727 వార్డులకు, 325 డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కసరత్తు చేశారు. ప్రధానంగా ఎస్ఈసీ నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రజాధరణ కలిగిన అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.

నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక..

డీసీసీ అధ్యక్షులు, నగరాధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పీసీసీ నియమించిన పరిశీలకులు, సమన్వయ నాయకులు సమావేశంలో పాల్గొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, డివిజన్ల వారీగా ఆశావహులను పరిగణనలోకి తీసుకుని చర్చించారు. ప్రతి వార్డు, డివిజన్‌లో భాజపా, తెరాస బరిలో ఉన్నందున అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది.

'సెలక్ట్- ఎలక్ట్' పద్ధతిలో ఎంపిక

పార్టీకి విధేయుడిగా ప్రజాదరణ కలిగి ఉండడం, తెరాసకు దీటుగా నిలబడగలిగే అభ్యర్థులను 'సెలక్ట్‌-ఎలక్ట్‌' పద్ధతిన ఎంపిక చేయనున్నారు. ఇన్ని రకాల ప్రమాణాలు కలిగిన పార్టీ నేతలు కొన్ని వార్డులు, డివిజన్లలో లేకపోవడం వల్ల నాయకులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం లోపు తుదిజాబితా విడుదల..

నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియనుండడంతో... ఇవాళ మధ్యాహ్నానికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. సమయం తక్కువగా ఉన్నందున పోటీలో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు ఇప్పటికే కులధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంతో పాటు బకాయిలు చెల్లింపులు పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేని వారు వ్యక్తిగత అఫిడవిట్‌ ఇస్తే సరిపోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కలిగినట్లేనని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని వార్డులు, డివిజన్లకు మధ్యాహ్నం లోపు అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండిః ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 120 పురపాలక, 9 నగరపాలక సంస్థల పరిధిలో 2,727 వార్డులకు, 325 డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కసరత్తు చేశారు. ప్రధానంగా ఎస్ఈసీ నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రజాధరణ కలిగిన అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.

నేడు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక..

డీసీసీ అధ్యక్షులు, నగరాధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పీసీసీ నియమించిన పరిశీలకులు, సమన్వయ నాయకులు సమావేశంలో పాల్గొని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, డివిజన్ల వారీగా ఆశావహులను పరిగణనలోకి తీసుకుని చర్చించారు. ప్రతి వార్డు, డివిజన్‌లో భాజపా, తెరాస బరిలో ఉన్నందున అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది.

'సెలక్ట్- ఎలక్ట్' పద్ధతిలో ఎంపిక

పార్టీకి విధేయుడిగా ప్రజాదరణ కలిగి ఉండడం, తెరాసకు దీటుగా నిలబడగలిగే అభ్యర్థులను 'సెలక్ట్‌-ఎలక్ట్‌' పద్ధతిన ఎంపిక చేయనున్నారు. ఇన్ని రకాల ప్రమాణాలు కలిగిన పార్టీ నేతలు కొన్ని వార్డులు, డివిజన్లలో లేకపోవడం వల్ల నాయకులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం లోపు తుదిజాబితా విడుదల..

నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియనుండడంతో... ఇవాళ మధ్యాహ్నానికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. సమయం తక్కువగా ఉన్నందున పోటీలో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు ఇప్పటికే కులధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంతో పాటు బకాయిలు చెల్లింపులు పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేని వారు వ్యక్తిగత అఫిడవిట్‌ ఇస్తే సరిపోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కలిగినట్లేనని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని వార్డులు, డివిజన్లకు మధ్యాహ్నం లోపు అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండిః ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో

TG_HYD_06_09_CONG_CANDIDATES_FINAL_TODAY_PKG_3038066 Reporter: M.Tirupal Reddy Dry ()తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితా ఇవాళ సిద్దం కానుంది. రాష్ట్రంలోని అన్ని పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో బుధవారం ఇంఛార్జుల అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు. ఎన్నికల సంఘం నియమనిబంధనలకు లోబడి, రిజర్వేషన్లకు అనుగుణంగా అధికార పార్టీకి దీటుగా నిలబడే అభ్యర్ధులను సెలక్ట్‌ ఎలక్ట్‌ పద్దతిన ఎంపికపై కసరత్తు జరుగుతోంది. LOOK వాయిస్ఓవర్‌1: రాష్ట్రంలోని ఎన్నికలు జరగనున్న 120 పురపాలక, 9 నగరపాలక సంస్థల పరిధిలో 2727 వార్డులకు, 325 డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఇవాళ మధ్యాహ్నంలోపు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేయాలని ఇప్పటికే పీసీసీ ఆదేశించించింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కసరత్తు చేశారు. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమనిబంధనలకు లోబడి రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రజాధరణ కలిగిన అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షులు, నగరాధ్యక్షులు, కంటెస్టడ్‌ ఎమ్మెల్యేలు, కంటెస్టడ్‌ ఎంపీలు, పీసీసీ నియమించిన పరిశీలకులు, సమన్వయ నాయకులు కలిసికట్టుగా సమావేశంలో పాల్గొని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లల పరిధిలో వార్డులు, డివిజన్ల వారీగా ఆశావహులను పరిగణనలోకి తీసుకుని చర్చించారు. ప్రతి వార్డులో...ప్రతి డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌, తెరాస పార్టీలు బరిలో ఉండి త్రిముఖ పోటీ ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉండడం, ప్రజాధరణ కలిగి ఉండడం, అధికార తెరాస పార్టీకి దీటుగా నిలబడగలిగే అభ్యర్థులై ఉండడం లాంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని సెలక్ట్‌-ఎలక్ట్‌ పద్దతిన ఎంపిక చేయనున్నారు. ఇన్ని రకాలు ప్రమాణాలు కలిగిన పార్టీ నేతలు కొన్ని వార్డుల్లో...డివిజన్లల్లో లేకపోవడంతో నాయకులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియనుండడంతో...ఇవాళ మధ్యాహ్నంనకు అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. అయితే సమయం తక్కువగా ఉండడంతో...పోటీలో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్ధులు ఇప్పటికే కులధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంతోపాటు బకాయిలు చెల్లింపులు పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేని వారు వ్యక్తిగత అఫిడవిట్‌ ఇస్తే సరిపోతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో..కొంత వరకు ఉపశమనం కలిగినట్లేనని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని వార్డులకు, డివిజన్లకు ముందుగా అనుకున్న విధంగా ఈ మధ్యాహ్నంనకు అభ్యర్ధుల ఎంపిక పూర్తి అవుతుందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.
Last Updated : Jan 9, 2020, 8:11 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.