ETV Bharat / city

పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

author img

By

Published : Feb 9, 2021, 7:54 PM IST

Updated : Feb 9, 2021, 9:09 PM IST

Congress announces graduate constituency candidates
పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

19:52 February 09

పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్​కు మాజీ ఎమ్మెల్సీ రాముల్​ నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​కు మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిని పేర్లను అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించింది. 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏర్పాటైన జీవన్ రెడ్డి కమిటీ నివేదించిన పేర్లలో వీరిద్దరిని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి ఆ మేరకు అధిష్ఠానానికి పేర్లను నివేదించినట్లు కమిటీ తెలిపింది.

ఇదీ చూడండి: నల్గొండ జిల్లాలో మరో 5 ఎత్తిపోతల పథకాలు మంజూరు

19:52 February 09

పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్​కు మాజీ ఎమ్మెల్సీ రాముల్​ నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​కు మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిని పేర్లను అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించింది. 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏర్పాటైన జీవన్ రెడ్డి కమిటీ నివేదించిన పేర్లలో వీరిద్దరిని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి ఆ మేరకు అధిష్ఠానానికి పేర్లను నివేదించినట్లు కమిటీ తెలిపింది.

ఇదీ చూడండి: నల్గొండ జిల్లాలో మరో 5 ఎత్తిపోతల పథకాలు మంజూరు

Last Updated : Feb 9, 2021, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.