ETV Bharat / city

CM Jagan Review On Omicron: ఒమిక్రాన్ వ్యాప్తి నివారణపై సీఎం సమీక్ష

author img

By

Published : Dec 27, 2021, 8:10 PM IST

CM Jagan Review On Omicron Variant: వైద్యారోగ్య శాఖపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా కొనసాగించాలన్నారు.

CM Jagan
CM Jagan

CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ఆయన.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ అన్నివిధాలా సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని సూచించారు. ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదన్న సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

"ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ సిద్ధం చేయాలి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా చేయాలి. ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలి"

- ఏపీ ముఖ్యమంత్రి జగన్

సాధారణ బదిలీలకు పచ్చజెండా..

వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నాటికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

విస్తరిస్తోన్న ఒమిక్రాన్..

Omicron Cases In Delhi: మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దిల్లీలో ఒమిక్రాన్ కేసులు మరో 63 నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా 152 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 151 మంది కోలుకున్నారు.

మొత్తంగా 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి దిల్లీ తొలి స్థానానికి చేరింది. దిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య 141గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కేరళలో 57, గుజరాత్​లో 49, రాజస్థాన్​లో 43, తెలంగాణలో 44 కేసులు నమోదు అయ్యాయి.

Night Curfew In Delhi: దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి వరకు జనసంచారంపై ఆంక్షలు విధించనున్నారు.

ఇది చదవండి: ఏపీలో థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది: ఆర్.నారాయణమూర్తి

CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ఆయన.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ అన్నివిధాలా సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని సూచించారు. ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదన్న సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

"ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ సిద్ధం చేయాలి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉద్ధృతంగా చేయాలి. ఒమిక్రాన్‌ విషయంలో భయాందోళన అవసరంలేదు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం బూస్టర్‌ డోస్‌ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలి"

- ఏపీ ముఖ్యమంత్రి జగన్

సాధారణ బదిలీలకు పచ్చజెండా..

వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నాటికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

విస్తరిస్తోన్న ఒమిక్రాన్..

Omicron Cases In Delhi: మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దిల్లీలో ఒమిక్రాన్ కేసులు మరో 63 నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా 152 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 151 మంది కోలుకున్నారు.

మొత్తంగా 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి దిల్లీ తొలి స్థానానికి చేరింది. దిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య 141గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కేరళలో 57, గుజరాత్​లో 49, రాజస్థాన్​లో 43, తెలంగాణలో 44 కేసులు నమోదు అయ్యాయి.

Night Curfew In Delhi: దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి వరకు జనసంచారంపై ఆంక్షలు విధించనున్నారు.

ఇది చదవండి: ఏపీలో థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది: ఆర్.నారాయణమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.