ETV Bharat / city

దేశభక్తిని పెంపొందించేలా అమృత్ మహోత్సవాలు: సీఎం - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​

హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తిని పెంపొందించేలా వివిధస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్​
సీఎం కేసీఆర్​
author img

By

Published : Mar 12, 2021, 12:31 PM IST

దేశభక్తిని పెంపొందించేలా అమృత్ మహోత్సవాలు

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే స్వాతంత్య్ర పోరాటానిది మహోన్నత ఘట్టమని సీఎం కేసీఆర్​ అభివర్ణించారు. హైదరాబాద్​ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్య్ర సంబురాలను జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్... మువ్వన్నెల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నాయని... ఈ సందర్భంగా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడంలో గాంధీ విజయం సాధించారన్న సీఎం... మహాత్ముడి ఆశయాలు ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించే సమయంలో గాంధీ ఉద్యమ స్ఫూర్తిని మననం చేసుకున్నానని తెలిపారు.

ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, బలిదానాలతో సిద్ధించిన స్వాతంత్రోద్యమాన్ని మననం చేసుకునేలా... 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం రమణాచారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసిందన్నారు. దేశభక్తిని పెంపొందించేలా వివిధస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కవి సమ్మేళనాలు, వ్యాస రచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలు జరుపనున్నట్లు వివరించారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపిన సీఎం... పార్టీలకు అతీతంగా అందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ' 'వోకల్​ ఫర్​ లోకల్'​తో స్వాతంత్ర్య యోధులకు ఘన నివాళి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.