ETV Bharat / city

సీబీఐ, ఈడీలతో భాజపా బెదిరింపులకు పాల్పడుతోంది : ఎంపీ రేవంత్ - భాజపాపై రేవంత్​ రెడ్డి మండిపాటు

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. భాజాపా ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని విమర్శించారు.

clp-leader-bhatti-vikramarka-call-to-protect-democracy
సీబీఐ, ఈడీలతో భాజపా బ్లాక్​ మెయిలింగ్: ఎంపీ రేవంత్
author img

By

Published : Jul 27, 2020, 2:55 PM IST

దేశంలో అప్రజస్వామిక పాలన కొనసాగుతోంది: భట్టి

దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసేందుకు... రాజస్థాన్​లో కుట్ర రాజకీయాలకు తెర లేపిందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ను కాపాడి... పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు.

భారతీయ జనతా పార్టీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్​ రేవంత్​ రెడ్డి అన్నారు. రాజస్థాన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీలను ఉసి గొలిపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భాజపా విధానాలపై శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

దేశంలో అప్రజస్వామిక పాలన కొనసాగుతోంది: భట్టి

దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసేందుకు... రాజస్థాన్​లో కుట్ర రాజకీయాలకు తెర లేపిందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ను కాపాడి... పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు.

భారతీయ జనతా పార్టీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్​ రేవంత్​ రెడ్డి అన్నారు. రాజస్థాన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీలను ఉసి గొలిపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భాజపా విధానాలపై శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.