ETV Bharat / city

కరోనా నియంత్రణకు రసాయనాల పిచికారి

కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు.. అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, మార్కెట్​లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో రసాయనాల ద్రావణాన్ని పిచికారి చేశారు.

author img

By

Published : Mar 28, 2020, 5:37 AM IST

chemicals spray in telangana for avoid corona virus
కరోనా నియంత్రణకు రసాయనాల పిచికారి

మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలు బయటకి వెళ్లకూడదని ప్రకటించిన అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేయిస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రసాయనాలు చల్లారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలైన కూరగాయాల మార్కెట్లు, సూపర్‌మార్కెట్​ల ఆవరణల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. మల్కాజిగిరిలోని రోడ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయల వద్ద ద్రావణాన్ని చల్లారు. మలక్‌పేట్‌లోనూ వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అగ్నిమాపకశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వైరస్‌ కట్టడికి ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్‌ను వెదజల్లారు.

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ సహా.. నగరంలోని పెట్రోల్‌ బంకులు, కళాశాలల్లోనూ సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లారు. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. బోధన్‌లోనూ వైరస్‌ నివారణకు అగ్నిమాపక అధికారులు చర్యలు చేపట్టారు. బాన్సువాడలోని ప్రధాన కూడళ్ల వద్ద రసాయనాన్ని వెదజల్లారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని సర్పంచులు .. ట్రాక్టర్‌కు యంత్రాన్ని అమర్చి గ్రామాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు.

కరోనా మహమ్మారి నివారణకు వరంగల్‌లో రహదారులు, మూసిన దుకాణాల ఆవరణలో రసాయనాలు చల్లారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో వైరస్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్యకళాశాలలో సోడియం హైపో క్లోరైడ్‌ను చల్లారు. కరోనా నిర్మూలనకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన రసాయనాల ప్రక్రియను కలెక్టర్‌ వెంకట్రావు పరిశీలించారు. వైరస్ నివారణకు మరిన్ని పటిష్ఠచర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్​

కరోనా నియంత్రణకు రసాయనాల పిచికారి

మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలు బయటకి వెళ్లకూడదని ప్రకటించిన అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేయిస్తున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రసాయనాలు చల్లారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలైన కూరగాయాల మార్కెట్లు, సూపర్‌మార్కెట్​ల ఆవరణల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. మల్కాజిగిరిలోని రోడ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయల వద్ద ద్రావణాన్ని చల్లారు. మలక్‌పేట్‌లోనూ వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అగ్నిమాపకశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వైరస్‌ కట్టడికి ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్‌ను వెదజల్లారు.

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ సహా.. నగరంలోని పెట్రోల్‌ బంకులు, కళాశాలల్లోనూ సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లారు. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. బోధన్‌లోనూ వైరస్‌ నివారణకు అగ్నిమాపక అధికారులు చర్యలు చేపట్టారు. బాన్సువాడలోని ప్రధాన కూడళ్ల వద్ద రసాయనాన్ని వెదజల్లారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని సర్పంచులు .. ట్రాక్టర్‌కు యంత్రాన్ని అమర్చి గ్రామాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు.

కరోనా మహమ్మారి నివారణకు వరంగల్‌లో రహదారులు, మూసిన దుకాణాల ఆవరణలో రసాయనాలు చల్లారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో వైరస్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్యకళాశాలలో సోడియం హైపో క్లోరైడ్‌ను చల్లారు. కరోనా నిర్మూలనకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన రసాయనాల ప్రక్రియను కలెక్టర్‌ వెంకట్రావు పరిశీలించారు. వైరస్ నివారణకు మరిన్ని పటిష్ఠచర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.