ETV Bharat / city

'రాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్'

author img

By

Published : Aug 8, 2019, 7:38 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్: లక్ష్మణ్

జమ్ము కశ్మీర్‌ విభజనతో కాంగ్రెస్‌లోనూ విభజన మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్‌తో కేవలం మూడు కుటుంబాలే రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధిపొందినట్లు వివరించారు. జమ్ము కశ్మీర్‌ మాదిరిగానే మోదీ, అమిత్ షా తెలంగాణ విమోచనదినానికి పరిష్కార మార్గం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఐదు వేల కోట్ల విలువైన భవనాలు సచివాలయంలో ఉన్నప్పుడు కూల్చి కొత్తవి కట్టడం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్: లక్ష్మణ్

ఇదీ చూడండి: వర్షాకాలం జాగ్రత్త సుమీ- ఇట్లు.. హైదరాబాద్​ పోలీస్​

జమ్ము కశ్మీర్‌ విభజనతో కాంగ్రెస్‌లోనూ విభజన మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్‌తో కేవలం మూడు కుటుంబాలే రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధిపొందినట్లు వివరించారు. జమ్ము కశ్మీర్‌ మాదిరిగానే మోదీ, అమిత్ షా తెలంగాణ విమోచనదినానికి పరిష్కార మార్గం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఐదు వేల కోట్ల విలువైన భవనాలు సచివాలయంలో ఉన్నప్పుడు కూల్చి కొత్తవి కట్టడం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్: లక్ష్మణ్

ఇదీ చూడండి: వర్షాకాలం జాగ్రత్త సుమీ- ఇట్లు.. హైదరాబాద్​ పోలీస్​

TG_Hyd_48_08_BJP_Laxman_PC_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ భాజపా రాష్ట్ర కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో కాంగ్రెస్‌లోనూ విభజన మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత లేకుండా గ్రూపులుగా వర్గాలుగా వీడిపోయిందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ విభజన విషయంలో కాంగ్రెస్ రాజ్యసభ విప్‌ భాజపా నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడని లక్ష్మణ్ చెప్పారు. అధికార పార్టీపైన పోరాటం చేయకుండా కాంగ్రెస్‌ లాలూచి రాజకీయాలు చేస్తోందని ఆక్షేపించారు. 370 ఆర్టికల్‌తో కేవలం మూడు కుటుంబాలే రాజకీయంగా ఆర్థికంగా లబ్దిపొందినట్లు వివరించారు. జమ్ము కశ్మీర్‌ మాదిరిగాన మోదీ, అమిత్ షా తెలంగాణ విమోచన దినానికి పరిష్కార మార్గం చూపుతారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని వ్యాఖ్యానించారు. ఐదు వేల కోట్ల విలువైన భవనాలు సచివాలయంలో ఉన్నప్పుడు కూల్చి కొత్తవి కట్టడం ఏంటని ప్రశ్నించారు. మాజీ ప్రధాని వాజపేయి మెమోరియల్ కు ఒప్పుకున్న కేసీఆర్... ఇంత వరకు స్థలం ఇవ్వలేదని విమర్శించారు. సుష్మాస్వరాజ్ మీద కేసీఆర్ కు ఏ మాత్రం గౌరవం ఉన్న... తెలంగాణ ప్రజల పిన్నమ్మను గౌరవించాలన్నారు. బైట్‌: కె లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.