ETV Bharat / city

నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం

నవంబర్ ఒకటో తేదీని అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవతరణ వేడుకలు నిర్వహణకు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు కృష్ణ మోహన్ నేతృత్వంలో, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మందితో కమిటీని ఏర్పాటుచేసింది.

author img

By

Published : Oct 28, 2020, 9:03 AM IST

ap government
నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం

నవంబరు 1న అవతరణ దినోత్సవం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ నేతృత్వంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మంది అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

జిల్లాల్లో అవతరణ దినోత్సవం నిర్వహించాల్సిందిగా కలెక్టర్​లకు సూచనలు ఇచ్చింది. 2014 నుంచి 2018 వరకు జూన్ 2 తేదీ.. అపాయింటెడ్​ డే రోజున గత ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు నిర్వహించింది. గత ఏడాది నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

నవంబరు 1న అవతరణ దినోత్సవం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ నేతృత్వంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మంది అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

జిల్లాల్లో అవతరణ దినోత్సవం నిర్వహించాల్సిందిగా కలెక్టర్​లకు సూచనలు ఇచ్చింది. 2014 నుంచి 2018 వరకు జూన్ 2 తేదీ.. అపాయింటెడ్​ డే రోజున గత ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు నిర్వహించింది. గత ఏడాది నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇవీచూడండి: నేడు ఎడ్‌సెట్‌ ఫలితాల వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.