ETV Bharat / city

ఏపీలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు

author img

By

Published : Aug 12, 2020, 6:00 PM IST

Updated : Aug 12, 2020, 6:38 PM IST

ap-corona-latest-updates
ఏపీలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు

17:58 August 12

ఏపీలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. 24 గంటల వ్యవధిలో 93 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా మృతులు 2,296కు చేరాయి. కరోనా నుంచి 1,61,425 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 57,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఏపీలో ఇప్పటివరకు 26.49 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా మృతులు...

గుంటూరు జిల్లాలో 13, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున కొవిడ్​తో మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో ఏడుగురు, కడప జిల్లాలో ఏడుగురు, విశాఖ జిల్లాలో ఆరుగురు వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు.

జిల్లాల వారీగా కొత్త కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1332 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1235, పశ్చిమగోదావరి జిల్లాలో 929, విశాఖ జిల్లాలో 797, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 781, గుంటూరు జిల్లాలో 762, నెల్లూరు జిల్లాలో 723, విజయనగరం జిల్లాలో 593, శ్రీకాకుళం జిల్లాలో 511 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి : దొంగతనం చేశాడని బాలుడి కాళ్లు కట్టేసి.. ఈడ్చుకెళ్లి...

17:58 August 12

ఏపీలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. 24 గంటల వ్యవధిలో 93 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా మృతులు 2,296కు చేరాయి. కరోనా నుంచి 1,61,425 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 57,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఏపీలో ఇప్పటివరకు 26.49 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జిల్లాల వారీగా మృతులు...

గుంటూరు జిల్లాలో 13, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున కొవిడ్​తో మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో ఏడుగురు, కడప జిల్లాలో ఏడుగురు, విశాఖ జిల్లాలో ఆరుగురు వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మరణించారు. 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు.

జిల్లాల వారీగా కొత్త కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1332 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1235, పశ్చిమగోదావరి జిల్లాలో 929, విశాఖ జిల్లాలో 797, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 781, గుంటూరు జిల్లాలో 762, నెల్లూరు జిల్లాలో 723, విజయనగరం జిల్లాలో 593, శ్రీకాకుళం జిల్లాలో 511 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి : దొంగతనం చేశాడని బాలుడి కాళ్లు కట్టేసి.. ఈడ్చుకెళ్లి...

Last Updated : Aug 12, 2020, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.