ETV Bharat / bharat

ఒకే స్కూటర్​తో 311సార్లు ట్రాఫిక్ రూల్స్​ బ్రేక్- రూ.1.61 లక్షలు ఫైన్​ వసూల్- పోలీసులకు చిక్కాడిలా! - TRAFFIC RULES VIOLATION 311 TIMES

311 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ద్విచక్ర వాహనదారుడు - పట్టుకున్న బెంగళూరు పోలీసులు - రూ.1.61 లక్షల జరిమానా వసూలు

Traffic Rules Violation 311 Times In Bengaluru
Traffic Rules Violation 311 Times In Bengaluru (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2025, 3:22 PM IST

Traffic Rules Violation 311 Times In Bengaluru : ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతీ వాహనదారుడి బాధ్యత. కానీ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుదీప్ అనే ద్విచక్ర వాహనదారుడు ఏకంగా 311 సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. హెల్మెట్​ ధరించకపోవడం, సిగ్నల్​ జంపింగ్​, వన్​ వే డ్రైవింగ్, అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్​ వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై 311 కేసులు నమోదయ్యాయి. అయినా చిక్కడు, దొరకడు అన్నట్టుగా అతగాడు తప్పించుకు తిరిగాడు. ఈ వివరాలతో శిబం అనే వ్యక్తి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడం వల్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు.

సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 3న (సోమవారం) సుదీప్‌ను పట్టుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నమోదైన మొత్తం 311 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులకు సంబంధించి రూ.1,61,500 జరిమానా విధించారు. వెంటనే ఆ ఫైన్ వసూలు చేశారు కూడా. అంతేకాదు సుదీప్ వినియోగించిన వాహనాన్ని కింద సీజ్ చేశారు. ఆ వ్యక్తిపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు గతేడాది నాటికి రూ.1,05,500 మాత్రమే ఉన్నాయి. అవి ఈ ఏడాది ఏకంగా రూ.1,61,500కు చేరాయి. ఈ అంశంపై సుదీప్‌కు నోటీసులు పంపినా బేఖాతరు చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇలా పట్టుకున్నారు
బెంగళూరులోని సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు- ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ ద్విచక్ర వాహనదారుడిని సోమవారం రోజు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇన్నాళ్లూ సుదీప్ వినియోగించిన టూ వీలర్ పెరియ స్వామి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. దీంతో పెరియ స్వామికి పోలీసులు లీగల్ నోటీసులు పంపారు. ఆ టూవీలర్‌తో సుదీప్ చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారాన్ని నోటీసుల్లో ప్రస్తావించారు.

Traffic Rules Violation 311 Times In Bengaluru : ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతీ వాహనదారుడి బాధ్యత. కానీ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుదీప్ అనే ద్విచక్ర వాహనదారుడు ఏకంగా 311 సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. హెల్మెట్​ ధరించకపోవడం, సిగ్నల్​ జంపింగ్​, వన్​ వే డ్రైవింగ్, అనుమతి లేని ప్రాంతాల్లో పార్కింగ్​ వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై 311 కేసులు నమోదయ్యాయి. అయినా చిక్కడు, దొరకడు అన్నట్టుగా అతగాడు తప్పించుకు తిరిగాడు. ఈ వివరాలతో శిబం అనే వ్యక్తి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడం వల్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు.

సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 3న (సోమవారం) సుదీప్‌ను పట్టుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నమోదైన మొత్తం 311 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులకు సంబంధించి రూ.1,61,500 జరిమానా విధించారు. వెంటనే ఆ ఫైన్ వసూలు చేశారు కూడా. అంతేకాదు సుదీప్ వినియోగించిన వాహనాన్ని కింద సీజ్ చేశారు. ఆ వ్యక్తిపై ఉన్న ట్రాఫిక్ జరిమానాలు గతేడాది నాటికి రూ.1,05,500 మాత్రమే ఉన్నాయి. అవి ఈ ఏడాది ఏకంగా రూ.1,61,500కు చేరాయి. ఈ అంశంపై సుదీప్‌కు నోటీసులు పంపినా బేఖాతరు చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇలా పట్టుకున్నారు
బెంగళూరులోని సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు- ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ ద్విచక్ర వాహనదారుడిని సోమవారం రోజు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఇన్నాళ్లూ సుదీప్ వినియోగించిన టూ వీలర్ పెరియ స్వామి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. దీంతో పెరియ స్వామికి పోలీసులు లీగల్ నోటీసులు పంపారు. ఆ టూవీలర్‌తో సుదీప్ చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారాన్ని నోటీసుల్లో ప్రస్తావించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.